About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday 30 June 2012

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా !


ఇప్పటి సినీ గీత రచయితల్లో నాకు సిరివెన్నెల గారూ ,చంద్ర బోస్ గారు మాత్రమె తెలుసు .దానికి కారణాల చర్చ పక్కన పెట్టేస్తే ,ఎన్నో సార్లు ''మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ''పాట విని వున్నా ఆ గీత రచయిత ''కందికొండ''అని నాకు  తెలియనే తెలియదు ...నిన్న ఈ ఆర్టికల్ చదివే వరకు. నా కథ 'కొత్త గూడెం పోరాగాడికో లవ్ లెటర్ 'వచ్చినపుడు కందికొండ గారు కాల్ చేసి మంచి కథ రాసానని  చెప్పారు .ఆ తరువాత 'మహిత' వచ్చాక నా పేరు గుర్తుంచుకుని మరీ రెండు భాగాలు చదివి అభినందించారు .నిన్న మళ్ళీ కాల్ చేసి ''నమస్తే తెలంగాణ ''లో వారి గురించి వచ్చిన ఆర్టికల్ గురించి తెలియ పరచారు .

ఒక అపరచిత జీవన చిత్రం వెనుక మనం విషాదాన్నో ,గెలవడానికి చేసిన పోరాటాన్నో అన్ని సార్లూ ఊహించలేం కదా ...ఆ బ్రతుకు చిత్రాన్ని  తరచి చూడగలిగే స్థితిలో వుంటే తప్పించి .కందికొండ గారి జీవిత చిత్రం  చదివాక గెలుపు వెనుక వున్న కష్టం మీద నాకో అవగాహన వచ్చింది . మనిషి సాయుధాన్ని  స్వప్నించే దారి ఎందుకో మనసులో మెరిసింది .''ఆలోచనలన్నీ క్రూరం గా మారుతున్న సమయంలో లైబ్రరీ పరిచయమైంది ''అనడం నాకీ ఆర్టికల్ లో అత్యంతగా నచ్చిన మాట .http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=39154&boxid=248371728 
 



Wednesday 27 June 2012

కొంచెమట్లా చెప్పుకోవాలనిపించింది !!!

dear samanya
 pushpa varna masam is really a master piece;a complex story,but so much ease you have displayed;metaphors and imageries are original and decorated with live emotions;folk and floral elements,a bit of magic realism add beauty and texture to the story;how could you conceive such a story;
bhumika is good,delicate,(difficult to craft) sweet little story;
your evolution as fiction writer is amazing;
keep it up!
warm wishes,chandra sekhar

టీవీ 9 బుక్ పాయింట్ లో  డా .వి .చంద్ర శేఖర్  రావు గారు, వారి ''ద్రోహ వృక్షం'' గురించి ....




Saturday 23 June 2012

ప్రయోగం !!!




 పూర్ణ చుక్క పెట్టి వదిలా 
ముగింపుకై అన్వేషణ 
సఫలమే 
***
 వినా ...
సూర్యాకాసమే    .
కొంత  శోధించాలి 
***
అన్వేషణేమీ  లేదు 
నిర్లిప్తతా కాదు 
కేవలత
***
ఒకలాగే వుండదు 
ఎప్పటికీ  
ఒక్క  కథే  
 ***
ఘర్షణ 
అవునన్నా కాదన్నా 
చోదనం
***
ఇప్పుడిక 
నదిలో పడవలా .
అవును తప్పక  పోవడమే 
***
కలచి వెళ్ళింది పున్నమి 
కప్పలు 
బెక బెకలాడుతున్నాయ్ 
***
వేళ్ళని బురదలో వేసి 
కలువ 
సుచిని స్వప్నిస్తుంది 
***
 తోచక వేసా పుస్తకం నిండా 
ఆల్ జీబ్రా 
నెట్టినా కదలకుంది 
***


ఎప్పుడూ ముందుకే 
అవును 
చరిత్ర 

Wednesday 13 June 2012

పుష్పవర్ణ మాసం !!!



''నవ్య '' వీక్లీలో నా  కథ  పుష్ప వర్ణ మాసం వచ్చింది .పాటకుల విద్వత్తుపై పై నాకు అపారమైన గౌరవం వుంటుంది.అందుకే ఈ కథ గురించి నాలుగు వాక్యాలు రాయాలనిపించినా రాయడం లేదు. ''మేజిక్ రియలిజం '' ''సింబాలిజం '' ''ఎలోగరి   ''...వంటి ప్రయోగాత్మక రచనలంటే నాకు చాలా ఇష్టం .అట్లా ఈ కథ నేను చేసిన ప్రయోగం .చాలా కాలం క్రితం  ''చెవులు''అని నే.బు.ట్ర  వాళ్ళు వేసిన ఒక నవల చదివాను.అదో అద్బుతం .అట్లాన్టివే  మరి కొన్ని.తెలుగులో వీ .చంద్ర శేఖర్ రావు గారూ,మునిపల్లె రాజు గారూ ,పతంజలి గారూ ఈ తరహా ప్రయోగాలు చేసారు .పతంజలి గారినయితే ,,అబ్బ...! చదివితే మరిచిపోగలమా మరుజన్మకైనా ..ఎంత అద్బుతమైన కథలూ అవి!! .అట్లా రాయగలిగితే ,,ఒక్క కథ రాస్తే చాలదా ...రాసేసి, చాల్లే ఇక అని చచ్చి పోవచ్చు.

Monday 11 June 2012

సత్యవతి గారు,ఓల్గా గారు ...!

ఇవాళ ''వివిధ''లో సత్యవతి గారితో  ఇంటర్వ్యు ...''అతి పీడితులు స్త్రీలే గనుక '', Andhra Jyothy Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra Jyoti, Andhra Jyothi, Telugu Culture and Tradition, IT News, Telugu Matrimonials, Classifieds, etc

 ''సూర్యా ''లో ఓల్గా గారి మృణ్మయ నాదం పై నేను రాసిన ఈ  వ్యాసమూ వచ్చాయి Surya Telugu Daily Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra , Telugu Culture and Tradition, etc   .రెంటినీ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఈ రచయిత్రులు ఇరువురూ స్త్రీల వేదనలను అక్షరీకరించారు గనుక .నాకు ఓల్గా గారితో పరిచయం లేదు.సత్యవతి గారి ఆత్మీయత తో ఈ మధ్యనే ఫోన్ పరిచయం .వారి సమగ్ర సాహిత్యం పైన పేపర్ ఒకటి రాయాలని ప్రయత్నం .

భూమికలో నా కథ వచ్చింది కదా   దానికేవరో  కామెంట్ పెట్టారు .ఆ కామెంట్ చాలా దురుసుగా వుంది.అట్లాగే  విహంగాలో కామెంట్ కూడా ...చూసి చాలా దిగులేసింది.నేనిక రాయనంటే రాయనని పాపాయి వాళ్ళ నాన్న కి ప్రకటించా కూడా .తను కాదు... ఇదంతా   స్త్రీల ని రాయనీకుండా చేయడానికి   వేశే   ఎత్తుగడ నువ్వు రాయాలి ,మానకూడదు ,భయపడ కూడదు అని చెప్పాడు .అయినా నాకు ఏమనిపించిందంటే అసలు ఎందుకు  రాయాలి అని .నాకేమీ కీర్తి కాంక్షో గొప్పతనాల యావలో లేవు కదా .నా సామాజిక బాద్యతని మరో    మార్గంలో నేరవేర్చవచ్చులే అనిపించింది  . ఎందుకని ఎవరైనా దురుసుగా అంటే  ఊరుకోవాలి  .మామూలుగా అయతే ఎవరేమైనా పేలితే మొహం పగలగోట్టేస్తాం కదా ఇప్పుడేమో ఇది కథా చర్చ కదాని  ఊరుకోవాలి . కల్పనా గారి తన్హాయి ని  వనజ గారు సమీక్షించి నపుడు  వచ్చిన కామెంట్స్ చూసి కూడా అట్లాగే అనిపించింది .ఆ చర్చకి అసహ్యించుకుని ఆ లింక్ షేర్ చేసిన అవినేని భాస్కర్ గారు ఆ  గూగుల్ ప్లస్ నే డిలీట్ చేసేసుకున్నారు .ఈ నెల  పాలపిట్టలో డాక్టరేట్ చేసిన ఒకావిడ మాధురి  కథ ''చంద్ర కళ ''గురించి రాస్తూ ''చలం ఈ   విధం గా  అక్రమ సంబంధాలను ఆకర్షణీయంగా   చిత్రించిన మాట నిజం ...2012 లో ఇలా అక్రమ సంబంధాలను మహత్తర విషయంగా చిత్రించడానికి రచయిత్రికి గల కారనేమిమితో తెలియలేదు ''అని రాసింది .ఒక స్త్రీవాద రచయిత్రి ఆ మాట  చదివి   స్త్రీలు కూడా ఈ పదజాలాన్ని వాడుతున్నారే అని బాధపడ్డారు.నా క్కూడా  ఆ  స్పందన అసత్య విమర్శ  అనిపించింది.ఏం  మనుషులో కొత్త రచయితలు వచ్చినప్పుడు  తప్పొప్పులు సున్నితంగా చెప్పి ప్రోత్సహించాలి కానీ చంపేస్తారా అని దిగులేసింది ...మనం మంచి వాల్లమైతే చెడును సంస్కరించాలి .చీకొట్టి దూరంగా జరిగితే లోపల మనలో చెడు వుందని ఒక అర్థం ... వీళ్ళు  స్త్రీలు ఎందుకవుతారు .స్త్రీల ముసుగులోని  రాజకీయ నాయకులు . వారి కుందేటికి మూడే కాళ్ళు  అనిపించింది  ...ఇట్లా ఇంత మదన పడ్డానా నా  ఇంత మదనకూ .తమని తాము స్థిరీకరించుకుంటున్న స్త్రీల పట్ల పురుషాధిక్య భావాలు ఇంకా పెంచి పోషించుకుంటున్న కుటుంబ సభ్యుల్లో ఒక అసహనం, ఇగో బయలుదేరాయి. వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నాలు మొదలౌతాయి. పని ప్రదేశాల్లో కూడా ఇది ప్రతిఫలిస్తుంది. స్త్రీల తెలివి, సామర్ధ్యం గుర్తించకుండా మరుగున పడేసే ప్రయత్నాలుంటాయి. ఇవన్నీ కాకపోతే తురుపుముక్క ఉండనే ఉంది. ఆమె శీలం మంచిది కాదని ఒక్కమాటంటే సరిపోతుంది. వీటన్నింటిని తట్టుకుని నిలబడాలంటే చాలా శక్తి కావాలి. ఆ శక్తి శ్రామిక మహిళల్లో కనిపించినంతగా మధ్యతరగతి మహిళల్లో కనిపించదు. శ్రామిక మహిళల శ్రమ శక్తి, శారీరక బలం పట్ల వాళ్లకు ఉన్న నమ్మకం గౌరవం, మధ్యతరగతి స్త్రీలకు ఇంకా రాలేదు.  అన్న సత్యవతి గారి  ఈ మాటలు విషయాలు  తెలిసినవే అయినా తేటతెల్లం చేసి  ..ఊరటనీ ధైర్యాన్ని ఇచ్చాయి ..అవును రాయాలి ఎందుకు రాయకూడదు అని ధైర్యం వచ్చిది .

ఇవాల్టి వారి ఇంటర్వ్యు లో నాకు వారిచ్చిన ఈ సమాధానం కూడా భలే నచ్చింది . మిమ్మల్ని మీరు స్త్రీవాద రచయిత్రిగానా - ప్రధాన స్రవంతి రచయితగానా - ఎట్లా గుర్తిస్తారు?

- ఒక మంచి స్త్రీవాద కథ లేదా దళిత వాద కథ, లేదా ముస్లింవాద కథ మంచి కథే అవుతుంది గానీ మంచి స్త్రీవాద కథ, మంచి దళిత వాద కథ, మంచి ముస్లింవాద కథ అవుతుందా? మంచి కథలన్నీ ప్రధాన స్రవంతిలోకి రావలసినవే అని నా అభిప్రాయం. ప్రధాన స్రవంతిని ఎట్లా నిర్వచిస్తాం.. ఏ విధంగా రాస్తే ప్రధాన స్రవంతి అవుతుంది? స్త్రీలను గురించి, దళితులను గురించి, ముస్లింలను గురించి రాసిన రచయితలు ప్రధాన స్రవంతి కాక మార్జిన్‌లో ఉండేవారు అని నిర్వచిస్తే నన్ను నేను స్త్రీ వాద రచయితగానే గుర్తించుకోదలిచాను. నిజమే కదా మరి ప్రధాన స్రవంతి  రచయితలంటే ఎవరు ?మొన్న మాట్లాడినప్పుడు సత్యవతి గారు నవ్వుతూ ''ప్రభువులు మెచ్చిన వారు ప్రధాన స్రవంతి వారు ''అన్నారు .  అది నూటికి   మున్నూరు శాతం నిజం .

సత్యవతి గారు మరిన్ని స్పూర్తిదాయకమైన కథలు రాయాలి .ఎందుకు రాయాలని నేను పడ్డ దిగులుకి ఇది నేనే ఇచ్చుకున్న సమాధానం .ఎందుకు రాయాలంటే పదిమందికి స్పూర్తినివ్వడానికి రాయాలి .మిగిలిన వారికంటే  రచయితలకి సమాజం మరింత స్పష్టం గా అర్థమవుతుంది కనుక రాయాలి .

వోల్గా గారి రచనలు నాకు మొదట పరిచయమైన స్త్రీవాద రచనలు . ''స్త్రీ వాద రాజకీయ చెైతన్యాన్ని సాహిత్యం రూపంలో అందించడానికి కథారచనను ఒక మార్గంగా ఎంచుకున్నాను''అని ప్రకటించినందుకూ , ఆ దిశగా వీలయినంత  మేరా ప్రయాణమూ జరిపినందుకు వోల్గా గారంటే నాకు చాలా ఇష్టం .
 
ఇక్కడ  ,టీవీ 9 బుక్ పాయింట్ లో వారిరువురూ ఇచ్చిన ఇంటర్వ్యు ల లింక్ లు ఇచ్చాను తప్పక  చూడండి,,,చదవండి.



 
.




పీఎస్ :అయితే నాకు కామెంట్ పెట్టిన భూషనాన్ని ఆ స్త్రీవాద రచయిత్రి ఏమన్నారంటే ''వారు భూషణం కారు బీరువా:) ''[పిరికి ] ...అని ఆపకుండా ఐదు నిమిషాలు నవ్వారు.

Friday 8 June 2012

ఆ పుస్తకం పేరు చెబుతారా…!




ఈ నెల భూమికలో వచ్చిన కథ ఇది .ఈ కథ నాతో రాయించింది  నా స్నేహితురాలు వినయ.తనెప్పుడూ ఈ కథలోని వీణ టీచరు వాళ్ళ అమ్మ గురించి చెప్పి చాలా దిగులు పడుతుండేది .ఆవిడ తనకిచ్చిన ,తను పోగొట్టుకున్న పుస్తకాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేది.నేను కథలు రాయడం మొదలు పెట్టాక ''సామాన్య నేనా నవల లోని  లోని కథ చెప్తాను నువ్వు రీ రైట్ చేస్తావా ''అని అడిగేది .రీ రైట్ అనే మాటకి నాకు నవ్వొచ్చేది.''అదేమన్నా రామాయణమా వినయా... మొల్ల రామాయణం ,నా రామాయణం ,నీ రామాయణం అని రాసుకునేందుకు'' అని నవ్వేదాన్ని .కానీ క్రమంగా ఆ కథ నా మనసునీ తోలచడం మొదలెట్టింది.అట్లా మా సంభాషణల నుండి మలిచిన  కథ ఇది.

''భూమిక''http://www.bhumika.org/ని నేను మొదటి సారి 1995 లో  అనుకుంటా చదివాను .మా డిగ్రీ కాలేజ్ తెలుగు లెక్చరర్ శోభా దేవి గారు నాతో చదివించారు.ఫెమినిసాన్ని తెలుసుకుంటున్న తొలి తొలి రోజులవి.భూమికని పడీ పడీ చదివేదాన్ని .[అప్పట్లో భూమిక వాళ్ళు మూలికా వైద్యం పై వేసిన ఆకుపచ్చ రంగు అట్ట  చిన్ని బుక్కు,భూమికకు సంబంధించీ  నా అపురూపమైన కలెక్షన్ లలో ఒకటి :}] . చెప్పాలంటే స్త్రీగా భూమిక నా స్వంత పత్రిక .

భూమిక నుండి నేను నేర్చుకున్నది చాలా వుంది.ఇవాళ స్త్రీగా నేను ఖచ్చితమైన అభిప్రాయాలను కలిగి ,క్లారిటీ తో ఆలోచించగలగడం వెనుక ,నిలబడటం వెనుక వున్నది ఆవాళ  స్త్రీ వాదాన్ని నాకు పరిచయం చేసిన శోభా దేవి గారూ,ఆవిడ పరిచయం చేసిన భూమిక ,స్త్రీవాద సాహిత్యమూ ...
    
సాహిత్య పత్రికలెన్నో పుడుతుంటాయి ,మధ్యే మార్గంలో ఆగిపోతుంటాయి .కర్ణుని చావుకి వంద కారణాలు .కానీ భూమిక ఇవాళ ఇరవై  వసంతాలని పూర్తి చేసుకుని మరింత పరిపుష్టంగా,పరిపూర్ణంగా ఎదిగి స్త్రీల పక్షాన ఆత్మీయంగా,దృడంగా నిలబడింది.భూమిక ద్విదశాబ్ది ప్రయాణం.దీని వెనుక ఎందరెందరో వున్నా ఆ అందరి ముందూ నిలబడింది మాత్రం నిర్ద్వందంగా కే.సత్యవతి గారే  .నిర్మలమైన వారి ఉత్సాహం వారి బ్లాగ్ చదువుతున్న ప్రతి సందర్భం లోనూ నా వెన్ను తట్టి గొప్ప ధైర్యాన్నీ , భవిష్యత్ మీద  ఆశనీ హామీ ఇస్తూ వుంటుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారికి,వారి టీం కి  నా గౌరవ, ప్రేమపూర్వక ,అభినందనలు ,ధన్యవాదాలు.

Wednesday 6 June 2012

''మహిత -ఉమా మహేశ్వర్ రావు గారు''


మహిత కథ పుస్తకంగా వచ్చింది .
ఈ కథని ఇట్లా పుస్తకం గా తీసుకురావాలని నేనసలు ఆలోచించలేదు .[''దొంగల సంత''కథని పుస్తకం గా తేవాలని ప్రయత్నాలు  జరుగుతూ వున్నాయ్.] మహిత మొదటి భాగం వచ్చినపుడు నాకో ఆర్త్రమైన మెసేజ్ వచ్చింది .పేరు లేదు .ఆ మెసేజ్ చూసాక కాల్ బాక్ చెయ్యాలనిపించింది .అట్లా నేను మొదటి సారి ఆర్ ఎం ఉమా మహేశ్వర్ రావు గారితో మాట్లాడాను.

పాటకులుగా మనకి మనవే అయిన అభిరుచులుంటాయి,ఆసక్తులుంటాయి.మన ఆసక్తికి అతి దగ్గరగా వచ్చిన ,మనం అమితంగా ఇష్టపడిన రచయిత ఒకానొక  రోజు మనతో మాట్లాడితే యెట్లా వుంటుంది ?మాట్లాడటమే  కాక  మనని మెచ్చుకుంటే యెట్లా వుంటుంది?ఆ రోజు ఎంత సుందరమైనదవుతుందీ ?దానినే  dreams comes true కలలే ఫలించడం అంటారు కదా !ఉమా మహేశ్వర్ రావు గారితో మాట్లాడటం నాకు అట్లాంటిదే .

మొదటి సారి ఆరెం ఉమా మహేశ్వర్ రావు గారి కథ చదివినపుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో .ఎక్కడ కూర్చుని చదివాను ,చదివినది ఏ వేళలో? అంతా నాకు హృదయంలో ఇమేజ్ లా బద్రపరచబడి వుంది . చాలా నచ్చినవీ  ముక్యమనుకున్నవే కదా మన హృదయంపై అలా ముద్ర వేసి నిలిచిపోతాయి .అంత ఇష్టం నాకు వారి కథలంటే .

వారు నాతో మాట్లాడటం అంటే మొదలు అదే చాలా పెద్ద విషయం  నాకు .అది కాకుండా నా కథని ఇష్టపడటం రెండో పెద్ద విషయం.ఇష్టపడ్డారు పో... స్వంతంగా వారి ఖర్చుతో మహితని పుస్తకంగా తీసుకురావడం నా జీవితంలో అతి పెద్ద విషయం .

డబ్బే ప్రామాణికం అనుకుంటే ...మహితని కావాలనుకుంటే స్వంతంగా  నేను  కూడా వేసుకోగలను నా డబ్బే పెట్టి .పబ్లిషర్స్ నీ పర్స్యు చేయగలను .కానీ నాకివాళ కలిగిన ఈ సంతోషపు ఫీలింగ్ ఎన్ని డబ్బులు కర్చు పెట్టినా నేను సంపాదించి ఉండలేను. ..కదా !!

''అంటరాని వసంతం -విమర్శనాత్మక పరిశీలన ''టెక్నికల్ గా నా మొదటి పుస్తకం .కానీ మొదటిగా పాటకులు లోకి వెళ్ళిన  పుస్తకం ''మహిత''.నాకు తిరుపతి అంటే చాలా,చాలా......ఇష్టం .ఆ తిరుపతిలో ''వల్లంపాటి సాహితీ మిత్రులు ప్రచురణ''గా నా పుస్తకం మొదటిగా మనుషులలోకి వెళ్ళింది .ప్రజల్లోకి తన బుజ్జి బంగారు చేతులతో పంపింది ''రాగలీన'' ...ఉమా మహేశ్వర్ రావు గారి అమ్మాయి .

రాగాలీనకూ ,ఒక గొప్ప మంచితనాన్ని ఏ ఆడంబరమూ లేకుండా అతి సరళంగా నాకు పరిచయం చేసిన ఉమా మహేశ్వర్ రావు గారికి  నేను మాటలలో పొందు పరచలేనంత  ఋణం  పడ్డాను .ఉమా మహేశ్వర్ రావు గారికి నా శతాధిక కృతజ్ఞతలు.


పీ ఎస్ : అజ్ఞానం చేత నేను మరచి పోయిన కృతజ్ఞతని  అన్వర్ గారు గుర్తు చేసారు . ఉమా మహేశ్వర్ రావు గారు పుస్తకం అనుకున్నంత మాత్రానే అందమైన బొమ్మలతో సహా వెయ్యడం వెనుక ఆర్టిస్ట్ కిరణ్ కుమారి గారి సహాయం సహృదయత ఎంతైనా వుంది.వారి బొమ్మల వల్ల  ఈ పుస్తకానికి అసలైన  ఆ కర్షణ వచ్చింది .అడిగినంతనే బొమ్మలు ఇచ్చినందుకు వారు నాకు తెలియకున్నా వారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచు కుంటున్నాను .థాంక్  యు కిరణ్ గారూ ,థాంక్ యు వెరీ మచ్