About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Showing posts with label పుస్తకాలు-జ్ఞాపకాలు.. Show all posts
Showing posts with label పుస్తకాలు-జ్ఞాపకాలు.. Show all posts

Tuesday, 14 October 2014

సామల సదాశివ స్మృతి సంచిక & some musings


ఐదు రోజుల క్రితం శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర రావు గారు ఫోన్ చేసి ''అమ్మ ,నీ అడ్రెస్స్ చెప్పరా , సామల సదాశివ గారి స్మృతి  సంచిక ఒకటి వేసారు ,చక్కటి వ్యాసాలున్నాయిరా అందులో  "అన్నారు . అడ్రెస్స్ పంపిన ఆవాళ 1230 పేజీల బృహద్గ్రంధమోటి ఇంటికి రాబోతుందని నాకు ఊహయినా లేదు . బుక్ తిరేగేయగానే నాకు,  లడ్డూ  కావాలా నాయనా అనే అడ్విమెంట్ గురుతోచ్చింది . సాహితీ ప్రియులు లడ్డూలా  కొని దాచుకోదగ్గది, శ్రద్దగా చదువదగ్గది ఈ ''పరిశోధన'' .

విశ్వేశ్వర రావు గారు... పట్టుకుని ఏక భిగిన చదవడానికి  కష్టంగా ఉంటుందనే  కానీ ఎంత అపురూపంగా వుందో ఈ పుస్తకం . దీన్ని చూడగానే మా అమ్మాయి వాళ్ళ పాపాయికి వారసత్వపు  బహుమతి గా ఇచ్చేద్దామని నిర్ణయించేసుకున్నా . నా మనవరాలు తన లేత కళ్ళతో ఈ పుస్తకాన్ని చదవడాన్ని ఇప్పుడే డ్రీం చేసా . జిజ్ఞాస నిండిన  కళ్ళు , నల్లటి చర్మపు రంగు , బారుపాటి జడ, అచ్చు బుజ్జి మా అమ్మాయ  పెదాలు ... అపురూపమైన మేధస్సు ,ఖంగుమనే ఖంటమూ ,అన్యాయానికి తిరగబడే మానసిక స్తైర్యమూ , చచ్చే దాకా పోరాడగల మొండి తనమూ ,శారీరక ద్రుడత్వమూ తో సాదా సీదా గా ,అందరికీ స్నేహంగా  అనిపిస్తూ  , ఆత్మీయతను పంచే  సాహసి  నా మనవరాలికి ఈ పుస్తకాన్నివిల్లు  రాసి బ్లాగ్ ముఖం గా ఇచ్చేస్తున్నాను .

ఇదేనా ఆవాళ ప్రాతినిధ్య రోజు అమ్మ...  ప్రమీలమ్మ గారు నాకు ఇచ్చిన నెమలి పించం  రంగు మంగళ  గిరి ఝరీ చీర కూడా . నల్ల పిల్ల కదా దానికి అది బాగుంటుంది . దాని లేత చెంప ఆ చీరని ఆత్మీయంగా స్పృశించి మీరు నాకు ఇచ్చిన ప్రేమని ఫీల్ కావాలి .

థాంక్స్ ఫర్ ది బుక్ అండ్ థాంక్స్ ఫర్ ఎవిరీ థింగ్ .

థాంక్స్ అనేది పిచ్చి చిన్ని మాట , ఇప్పటికిప్పుడు నాకు కలిగిన ఈ అలవి కాని  సంతోషాన్ని వ్యక్త పరచడానికి నా దగ్గర మాటలు లేవు . కాలక్రమంలో వీలు వెంబడి నెమ్మదిగా ఈ సంతోషాన్ని మీకు తిరిగి ఇస్తాను .

పి ఎస్ :నా కలలెప్పుడూ నిజమవుతాయి :))




Saturday, 4 May 2013

మరణానంతరము



ఒక రోజు ఒక ప్రముఖ వ్యక్తి చాలా ఆసక్తిగా ''సామాన్యా  ,నా గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటుందీ ''అని అడిగారు. ఆవాళ బుద్ధి పూర్వకం గా నేను సమాధానాన్ని దాటవేసాను .

నేను కథలు రాయటం మొదలు పెట్టాక నాకు సాహితీపరులు కొంతమంది పరిచయమయ్యారు . వారిలో కొంత మంది ఒక రచయిత గురించి అదే పనిగా చాడీలు చెప్పేవారు . అట్లా వింటే ఏమవ్వాలి ?ఏమో నాకయితే ఆ సదరు వ్యక్తి పట్ల హృదయం సరళమై ,జాలి కలిగి స్నేహం పెంచుకున్నాను .ఇదేమ్ స్వభావం ?

నా లాగే నా బిడ్డ బిడియస్తురాలు . మనుషులు నచ్చితే ఎంత వాచాలత్వం రాగలదో ,హృదయానికి దగ్గరగా రాని వారిపట్ల దాని గొంతు రాయవుతుంది . దాని క్లాస్ మేట్స్ తల్లులు కూడా ఈ అమ్మాయికి గర్వం అనుకునే వారట .ఏడేళ్ళ  చిన్న బిడ్డకు గర్వమనే పదార్తాన్ని ఆపాదించిన లోకం లేక్కేమిటికసలూ ?

ఈ సమస్త ఆలొచనలు నాకు ''మరణాంతరము''చదివిన తరువాత కలిగాయి . చెప్పకేం ... నేను బోలెడు చదివాను .చిన్నప్పటి  నుండీ ఇప్పటి వరకూ ,,,కానీ ఈ నవల ఇచ్చా పూర్వకం గా మానవుని బహుముఖాలని స్పృశించి నంతగా మరే నవలా స్పృశించడం  నా చిన్ని ప్రపంచం లో నేను చదివి ఉండలేదు  .

రచయిత శివరామకారంత్ .

ఈ రచయితకు బొంబాయికేలుతున్న  రైలు ప్రయాణం లో ఒక వ్యక్తి పరిచయమవుతాడు ఆరేడేళ్ళ పరిచయం లో కొన్ని మార్లు కలుసుకోవడము ... కొన్ని ఉత్తరాలు .... !

కొందరు మనషులు అతి చిన్ని పరిచయంలోనే చాలా ప్రేమించెంత గా మనకెందుకు నచ్చుతారు?బహుశా  వారిలోని నిష్కల్మషత్వాన్ని మన హృదయం కనిపెట్టడం కావచ్చును  ,లేదా మన హృ దయమూ వారి హృదయమూ ఒకే పదార్ధం తో తయారయిందనే స్పృహ మనకు కలగడమూ కావచ్చును  !

యశ్వంత రావ్ కి అతి చిన్ని పరిచయంలోనే శివరామకారంత్ మీద అలాటి అభిప్రాయం కలుగుతుంది .

అంత్య కాలంలో యశ్వంత రావు గారు చూడాలనుకున్న ఒకే వ్యక్తి కారంత్ గారు .వీరు వెళ్ళే సరికే ఆయన చనిపోతారు . శవ దహనం ఈయనే చేయవలసి వస్తుంది . దానితో పాటు వీరి పేరిట యశ్వంత్ రావు గారు పదిహేను వేల రూపాయల డ్రాఫ్ పంపి తను నెల నెలా పంపవలసిన వారికి పంపాలని ,మిగిలిన డబ్బుని ''నేనే మీరనుకుని ''ఖర్చు చేయమని చెబుతారు .

అసలు ఈ యశ్వంత్ రావు గారు ఎవరూ ... రచయిత అన్వేషణ  మొదలు పెడతారు . అతను వదిలి వెళ్ళిన డైరీ లో ,పెయింటింగ్ లలో ,రహస్యాన్ని  దాచుకున్న మారు పేర్లు లో ... ఆయన డబ్బు పంపమన్న వారి చిరునామాలు పట్టుకుని వారి ఇళ్ళకు వెళ్తాడు . ఆయన విడిచి పెట్టి పారిపోవడానికి కారణమైన భార్యా,కొడుకూ ,అతను ప్రేమించిన స్త్రీ ,ఆవిడకి పుట్టిన పిల్లలు  అక్కడ రక రకాల అనుభవాలు ,రక రకాల పరిచయాలు .

రచయిత మిత్రుడి కోసం బాధ్యతగా సాగించిన అన్వేషణలో ఒకే మనిషి గురించి ఒక్కోరు ఒక్కో అభిప్రాయాన్ని చెబుతారు .

అవునూ...   అదెలా సాధ్యం ?ఒక వ్యక్తి మంచి వాడయితే మంచి వాడవ్వాలి లేకుంటే చెడ్డ వాడన్నా  అవ్వాలి కదా !ఒకే మనిషి ఒకరికి మంచి ఒకరికి చెడ్డా ఎట్లాగా ?

కానీ నిజమంతే మనిషి బహుముఖీనుడు . అది ఒకటి  . రెండోది  ఏమిటంటే మీ వలన సహాయం పొందిన వారికి మీరు మంచి వారు .అవును ,మీరు చెడ్డ వారయినప్పటికీ , మీరు మంచి వారు కాగలరు.  అలాగే ఏ కారణానో మీరు నచ్చని వారికి మీరు మంచి వారయ్యీ చెడ్డ వారు కాగలరు . అట్లాగే ఒక మనిషి స్వభావపు అంచనాలలో మన స్వభావ స్తోమత కూడా కలిసి వుంటుంది . మన వ్యక్తిత్వ ఔన్నత్యమొ ,అల్పత్వమో ఎదుటి వారిపై అభిప్రాయాలను ఏర్పరచుకునేలా చేస్తుంది . ఒకరు ఒకానొక కాలం లో మనకు బాగా నచ్చి, తరువాత వెగటు కలగడానికి కారణం మన మనస్తత్వం లోని చాపల్యత కావచ్చును . ఈ విషయాలన్నింటినీ ఒక్కో పాత్రని ఆలంబనం చేసుకుని చెపుతారు కారంత్ .

ఇంతకీ ఈ నవల ఏం చెబుతుందీ ?యేమని ముగింపుని ఇచ్చింది ?ఏమీ లేదు ! ఒక జీవితాన్ని చిత్రించింది ,అంతే !అంతే అయితే మరి పాటకునికి లాభమేమిటి ?దీనికి సమాధానం ఇది -ప్రతి సృజనా వాచ్యంగా పాటకుడినో ,మానవుడినో ఇది చేయమని శాసించదు. అన్ని సార్లు ముగింపుని కృతకంగా చెప్పి దిశానిర్దేశం చేయడం వీలు కూడా కాదు . కానీ మంచి రచన చదివిన తరువాత మనం  మానసికంగా సంపన్నులమవుతాం . ఇలా చేయడం తప్పు,లేదా ఇది సరైనదే అనే అవగాహన ఏర్పరచుకుంటాం.వాచ్య సూచనలు లేకుండానే మంచి వైపుకి మొగ్గుతాం . ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప  రచన మనుషులను నాగరీకులని చేస్తుంది .

చిక్కటి భాష ,లోతైన తాత్వికత కలిసిన ఈ నవల మనల్ని అంతర్ముఖీనులను చేస్తుంది . మానవ స్వభావాన్ని అర్థం చేసుకునే మానసిక ఎదుగుదలని  ఇస్తుంది .

పేజీల కొద్దీ వాక్యాలు నా హృదయానికి హత్తుకుని పోయాయి .ఈ రచయిత నా హృదయానికి దగ్గరి వాడుగా తోచాడు . ఆలొచనల సామీప్యత వలన ఆత్మీయుడయ్యాడు . నేర్చుకోవలసినది చెప్పి గురువయ్యాడు .

'' మన పూర్వ ఋషులు కొందరు జగత్తు,సృష్టి విషయంలో -ఇది ఇలా ,ఇదే సత్యం ;ఇదే చివరి మాట -అనే రీతిగా చెప్పారు కదా మీరు వేదాలనండీ ,వుపనిషత్తులనండీ ,మరేమన్నా అనండి ,తపస్సుతో తెలుసుకున్నదనండి ,భగవంతుడే ఒక చెవిలో ఊదినాడనండి ,నాకొక సంశయం . ఈ విశ్వం ,సృష్టి వీని విషయంలో కొద్దిగా నేనూ  చదివి తెలుసుకున్నాను . జీవ కోటి ఈ యాత్ర ఎప్పుడో ప్రారంభమయింది .యెక్కడికొ సాగుతున్నది ;ప్రయాణం ప్రారంభమయిన ఎంతో కాలం తరువాత ,దారిలోని రైల్వే స్టేషనులో బండి ఎక్కే ప్రయాణికుని లాగా ,మనుష్యుడనే ప్రాణి లోపల ప్రవేశించాడు ;ప్రవేశించిన వాడు ప్రవేశించినట్టు దిగిపోనూ పొయాడు . జీవిత ప్రయాణమేమో ఇంకా ముందుకు సాగింది .దాని లక్ష్యం ఇంతవరకూ తెలియ లేదు 'ముందు దారి లెక్క పెట్టలేనంత దూరం ,అలాటి సమయం లో ఎవరైనా సరే ''నేను దీని రహస్యం తెలుసుకున్నాను .'' ''ఇదే సత్యం ''అని ఘంటాపథం గా చాటితే నగుబాటు కాదా?''

పీఎస్ :ఈ నవలను నాకు పంపినందుకు ,మంజుల గారు మీకు నేను చాలా రుణపడ్డాను . మీ సహృదయతకు ప్రేమ పూర్వక కృతజ్ఞతలు .




Tuesday, 9 April 2013

ఫుట్ ప్రింట్స్

నిన్న నేను చెప్పిన ఫుట్ ప్రింట్స్ ఇదే ...

Monday, 1 April 2013

జిలుకర శ్రీనివాస్



ప్రాతినిధ్య ఆవిష్కరణకు నేను పిలిచిన వక్తలలో జిలుకర శ్రీనివాస్ ఒకరు .శ్రీనివాస్ నా  జూనియర్ . శ్రీనివాస్ ప్రకారం నాకు రాజకీయాలుతెలియవు[అతను చెప్పే రాజకీయాలు అర్థం కాకపోతే ఇక ఏమీ తెలీదనే ...]  .నేను చాలా అమాయకురాలిని  .కేవలం హృదయ వాదిని . అతను చెప్పింది నిజమే అయితే బహుశా అది లొపమేమో . ఆ లోపం నా పుట్టుక రీత్యా వచ్చి పడింది .

పాణి గారి అస్తిత్వం -ఆధునికత- మార్క్సిజం  చదివిన తరువాత అస్తిత్వాల పట్ల ఆ పుస్తకంలో నాకో భావజాల ఐక్యత కనిపించింది. అందుకని నేను పాణి గారిని వక్తగా పిలిచాను .పాణి  గారి ప్రతి మాటా శ్రీనివాస్  ని ఇరిటేట్ చేసింది.  ఆ అసహనాన్ని నా మీద కూడా వేదిక మీదే చూపించాడు శ్రీనివాస్ . అవతలి మనిషిలో వున్న టాలరెన్స్ శ్రీనివాస్ లో లేకపోయిందనిపించినా,అతని  అసహనంలో న్యాయముంది .ఆ అసహనం శతాబ్దాల సహనత్వం  నుండి వచ్చిన తిరుగుబాటు .  నిజానికి శ్రీనివాస్ రాజకీయాలపట్ల అంగీకారం వున్నా సంపూర్ణ అంగీకారం లేకపోవడం  ... నా అసహాయత .[ఇక్కడేం పదం వాడాలో నాకు తెలీదు ] .

శ్రీనివాస్ హృదయం లో విపరీత ఘర్షణ నెలకొంటే తప్ప ఏదీ రాయడని నాకు తెలుసు.  అందుకే ఇవాళ పొద్దునే శ్రీనివాస్ వ్యాసం వచ్చిందని కిరణ్ చెప్పగానే చదవక ముందే ఇది ఆ వేదిక మీద పుట్టిందేనని నాకు అర్థమయిపోయింది . కాల్ చేసి క్లారిఫై చేసుకున్నాను . నాకు పాటం చెప్పటానికి ఒక కాల్ చేస్తే సరిపోయేదే కానీ శ్రీనివాస్ సందర్భం వచ్చింది కనుక నా బోంట్లకు కూడా కలిపి పాటం చెప్పేసాడు .

వ్యాసం చాలా బాగుంది .చదవాలి తప్పక . రంగనాయకమ్మ ఒకటో తరగతి వాళ్లకి కూడా సిద్దాంతం అర్థమవ్వాలని రాస్తే ,శ్రీనివాస్ పీ హెచ్ డీ వాళ్లకి కూడా వ్యాసం  అర్థం కాకుండా రాస్తాడు . అందుకు  కారణం ఆ అబ్బాయి ని వత్తిడి పెట్టె భావజాల  ఘర్షణ  .వ్యాసమ్ రాయాలనుకోవడం కంటే తన వేదనను వెళ్ళకక్కడమే ప్రధానం గా భావిస్తాడు . కనుక వ్యాసం తుదీ మొదలూ తెలుసుకోవడానికి మనం జ్ఞానులమై వుండాలి . ఎంత విభేదించినా ఈ విషయం లో మాత్రం శ్రీనివాస్ మార్క్సిస్టుల అడుగుజాడల్లో వెళ్తాడు .ఇది విమర్శ కాదు పొగడ్తె .

                                                       నా కాలపు మేధావి జిలుకర శ్రీనివాస్ .




           మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికి రాదు
                                                  - డా.జిలుకర శ్రీనివాస్

ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులూ ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

సాహిత్యంలో వాస్తవికత ఒక తిట్టుపదంగా మారిపోయింది. వాస్తవికత ఒక నిర్మాణం. గోపాలకృష్ణమ శెట్టి, కందుకూరి, గురజాడలు బ్రాహ్మణీయ వాస్తవికతను నిర్మాణం చేశారు. అయితే, బ్రాహ్మణీయ వాస్తవికత నికరంగా నిలబడకుండానే పలాయనవాదంలోకి జారుకుంది. అదే కాల్పనికవాదం. భావ కవిత్వం దానిలో ఒక పాయ. కుల వాస్తవికతను సైద్ధాంతిక, రాజకీయ క్షేత్రంలో కింది కులాలు వ్యక్తీకరించడమే కాదు దాని తార్కికతనూ నిర్ణాయకవాదాన్నీ ప్రశ్నిస్తున్న 'కాలం'లో తెలుగు సాంస్కృతిక 'స్థలం' బ్రాహ్మణీకపు కాల్పనికవాదంలోకి సచేతనంగానే పాదం మోపింది. అదే నడక అభ్యుదయ, విప్లవ రంగాలను కూడా నియంత్రించింది. దానికి మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పునాది. అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు మార్క్సు ప్రతిపాదించిన భౌతికవాదం పునాది. లెనిన్ మార్క్సు జ్ఞాన సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దానికి శాస్త్రీయతను చేకూర్చాడు. లెనిన్ ప్రతిపాదించిన 'పరావర్తన సిద్ధాంతం' (రిఫ్లెక్సివ్ థీయరీ) ప్రపంచ వ్యాప్తంగా జ్ఞాన సిద్ధాంతాలను విశేషంగా ప్రభావితం చేసింది. సాహిత్యంలో అభ్యుదయ, విప్లవ రచయితలు పరావర్తన సిద్ధాంతాన్ని బలంగానే ప్రచారం చేశారు. మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతానికి పరావర్తన సిద్ధాంతమే పునాది. ఈ సిద్ధాంతం నిజంగా అద్భుతమైంది. కాని, ఈ సిద్ధాంత స్ఫూర్తిని ఇక్కడి బ్రాహ్మణవాద రచయితలు గ్రహించలేదని విమర్శకుల భావన.

త్రిపురనేని మధుసూదనరావు 'సాహిత్యంలో వస్తు శిల్పాలు' అనే గ్రంథంలో 'పరావర్తన సిద్ధాంతం - సాహిత్యం' అనే ఉపశీర్షిక కింద పరావర్తన సిద్ధాంతాన్ని సోదాహరణంగా వివరించారు. "...ఇంద్రియ జ్ఞానాలకి ఆలోచనలకీ మూలాధారం ఏమిటి? అంటే చైతన్యానికి మనస్సుకీ సంబంధం ఏమిటి? పదార్థం ముందు, దాని నుంచీ చైతన్యం ఉత్పన్నం అవుతుంది అని చెప్పుకోవటం మాత్ర మే చాలదు. మనిషికి ఇంద్రియ జ్ఞానాలూ, ఆలోచనలూ, ఆవేశం వంటివి ఎలా వస్తాయి అనేది భౌతికవాద జ్ఞాన సిద్ధాంత మౌలిక ప్రశ్న. దీనికే లెనిన్ పరావర్తన సిద్ధాంతం సమాధానం చెపుతుంది'' అని తెలిపారు. మనిషి మనస్సు నుండే జ్ఞానం పుడుతుందని భావవాదులు తలుస్తారనీ, భౌతికవాదులు ఇంద్రియ జ్ఞానం వికసిస్తుందని చెపుతారని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన సముపార్జనా క్రమంలో ఇంద్రియాల ద్వారా సమాచార గ్రహణం తొలి దశ. ఇంద్రియాలు లేకుండా మెదడుకు సమాచారం అందే వీలు లేదు. మెదడూ, ప్రపంచం రెండూ పదార్థ రూపాలే అంటాడు త్రిపురనేని. ఈ రెండింటి మధ్య వుండే సృజనాత్మకమైన, క్రియాశీలమైన సంబంధాన్ని పరావర్తన సిద్ధాంతం అంటారని ఆయన భావన.

"అద్దంలో చూసుకున్నప్పుడు మొఖం బింబం. అద్ధంలో కనిపించే మొఖం ప్రతిబింబం. బింబం లేకుండా ప్రతిబింబం ఉండదు. అలాగే మెదడు అద్దం అయితే అందులో ప్రతిబింబించేది బాహ్యప్రపంచం. ఈ బింబ ప్రతిబింబ ఉదాహరణ చాలా ప్రాథమికమైన పోలికగా మాత్రమే గ్రహించాలి. ప్రతిబింబానికి పరావర్తనకీ చాలా తేడా వుంది. అద్దంలో ప్రతిబింబానికి బింబానికీ మధ్య క్రియాశీలమైన, సృజనాత్మకమైన పరావర్తనా శీలమైన సంబంధం ఉండదు. మెదడు కేవలం అద్దం కాదు. అదొక జీవ శారీరక వ్యవస్థ. నిర్ధిష్ట క్రియలను నిర్వహించే అనేక సూక్ష్మ భాగాల అవిభాజ్య సముదాయం. కాబట్టి బాహ్య ప్రపంచం జ్ఞానానికి మూలం. ఇంద్రియాలు జ్ఞానానికి సాధనాలూ, వాహికలూ మాత్రమే కానీ ఇంద్రియాలే జ్ఞానానికి మూలం కాదు. బాహ్య ప్రపంచం ఇంద్రియాల ద్వారా మెదడులో పరావర్తనం చెందకుండా జ్ఞానం అనేది ఉండదు'' అంటారు త్రిపురనేని మధుసూదనరావు. మార్క్సు పెట్టుబడిదారీ వ్యవస్థను విశ్లేషించడానికీ, ఉత్పత్తి విధానాన్ని సూత్రీకరించడానికీ కూడా పరావర్తన సిద్ధాంతమే మూలమని త్రిపురనేని భావన. పంటని ఉత్పత్తి చేసేందుకు భూమి, నీళ్లు, నాగలి, ఎద్దులు, ఎరువులు వంటివన్నీ అవసరమనీ, అవన్నీ బాహ్య ప్రపంచంలో దొరికేవనీ, అవి మనిషి చైతన్యంతో సంబంధం లేకుండానే ప్రపంచంలో ఉంటాయనీ, కానీ, వాటిని సృజనాత్మకంగా పరావర్తనం చేసుకోవటం వల్లే రైతులు పంటలు పండిస్తున్నారనే ఉదాహరణ సరిపోతుందని ఆయన అన్నాడు. మానవ చేతన కేవలం వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబించటమే కాదు, దాన్ని పునర్ సృష్టిస్తుంది కూడా అని లెనిన్ తన వృద్ధాప్యంలో రాసుకున్న నోట్సులో పేర్కొన్నాడు.

అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న బాహ్య ప్రపంచాన్ని మానవుడు తనకు అవసరమైన విధంగా నిర్మాణం చేసుకుంటాడని దీని అర్థం. ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని బట్టీ, చారిత్రక పరిమితుల్ని బట్టీ అది నిర్ణయించబడుతుందని కూడా త్రిపురనేని పేర్కొన్నారు. ఈ మొత్తం సిద్ధాంతంలో 'బాహ్య ప్రపంచం', 'వస్తుగత ప్రపం చం', 'ఇంద్రియ చర్య' అనేవి చాలా కీలకం. బాహ్య ప్రపంచం అంటే కేవలం భౌతిక వస్తు సముదాయం మాత్రమే కాదు. ఆ వస్తు సముదాయాన్ని నియంత్రించే లేదా ఉత్పత్తి చేసే లేదా ప్రకృతిలో అంతర్భాగంగా జీవించే మానవ సముదాయం కూడా. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు కూడా బాహ్య ప్రపంచం అనే భావనలో అంతర్భాగం. మానవుల మధ్య వుండే ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి విధానంతో పాటు మారుతాయనేది మార్క్సిస్టు అవగాహన. కాని కులం అనేది ఒక సంబంధం. ఆయా కులాలకు వ్యవస్థలో నిర్దేశిత స్థానం అనుసరించే అనులోమ, విలోమ సంబంధాలు ఉంటాయి. ఇవి వందల యేళ్లుగా ఉత్పత్తిలో గుణాత్మకమైన మార్పు వచ్చిన తర్వాత కూడా మారకుండా కొనసాగుతూ వున్నాయి. ఇండియా సమాజంలోని మానవ సంబంధాలు కుల సంబంధాలుగా వున్నాయనే సంగతిని ఇంద్రియాల ద్వారా మెదడుకు నిరంతరం చేరవేయబడుతూనే ఉంటుంది. ఇండియాలోని ప్రతి వ్యక్తి చైతన్యం కుల సంబంధాల ప్రకారమే నిర్ణయించబడుతుందనేది వాస్తవం. చివరికి ధర్మ పరివర్తన చెందిన మూలవాసులు కూడా ఈ కుల నిర్మాణం నించి విడిగా మనలేరు. కాబట్టి ఇంద్రియ చర్య కుల వ్యవస్థను పరావర్తనం చేస్తుంది. అంటే మానవుడి జ్ఞానంలో కుల వ్యవస్థ తాలూకు పరావర్తనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

అదే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానంతోటే వివిధ కులాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి అంతర్వును బట్టీ, స్థానం, స్థాయిని బట్టి ఆయా కులాల వ్యక్తుల మానసిక ప్రవర్తన ఉంటుంది. అది ఆ కులస్తుడి చైతన్యమై నిరంతరం అతని ప్రమేయ, ప్రవర్తనలను నిర్దేశిస్తుంది. ఇది వాస్తవిక దృశ్యం. ఈ వాస్తవిక దృశ్యం అనేక కుల నియమాల వల్ల నియతం అవుతూంటుంది. ఈ వాస్తవాన్ని మార్క్సిస్టు రచయితలు అంగీకరించలేదు. లెనిన్ వృద్ధాప్యంలో చెప్పిన మానవ చైతన్యం తిరిగి వాస్తవ ప్రపంచాన్ని సృష్టిస్తుందనే సూత్రీకరణను సారభూతంగా అర్థం చేసుకొంటే రచయితలు కుల సంబంధాలను, వాటిని నిర్ణయిస్తున్న భావజాలాన్ని సృజనాత్మకంగా చిత్రించేవారు. కానీ అలా చేయలేదు. అంటే బ్రాహ్మణవాద రచయితల చైతన్యం వాస్తవ ప్రపంచాన్ని పరావర్తనం చేయటం లేదనీ, కాల్పనికతను లేదా అబద్ధాన్ని నిర్మాణం చేస్తుందని అంగీకరించాలి.

పరావర్తన సిద్ధాంతం చారిత్రక భౌతికవాదంతో అంతస్సంబంధం కలిగి ఉంది. చారిత్రక భౌతికవాదం అనేది సమాజాన్ని అధ్యయనం చేసే విశ్లేషించే ఒక పద్ధతి. ఒక మెథడాలజీ. పాశ్చాత్య సమాజాన్ని విశ్లేషించినట్టే కుల నిర్మిత సమాజాన్ని విశ్లేషించే ప్రయత్నం జరిగింది. అది మెథడాలాజికల్ ప్రాబ్లెం. సమాజ పరిణామ క్రమాన్ని మార్క్సిస్టు పద్ధతిలో అర్థం చేసుకొనే ప్రయత్నం త్రిపురనేని చేశారు. రాంభట్ల కృష్ణమూర్తి కూడా అదే ప్రయత్నం చేశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అన్వర్తింప చేసే కృషి రాంభట్ల కొనసాగించారు. ఆయన వాస్తవికతను పురాణ వాస్తవికత, ప్రబంధ వాస్తవికత, కాల్పనిక వాస్తవికత, సోషలిస్టు వాస్తవికతలుగా అనేక విభజనలు చేశారు. ఆ క్రమంలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నిర్మాణం వెనక ఉత్పత్తి పోషించిన పాత్రను తెలిపారు. ఉత్పత్తి క్రమంలో రూపొందిన సాహిత్యమే వేదాది సాహిత్యమని ఆయన భావించారు. ఈ కాల్పనిక ఆధిపత్యవాద సాహిత్యంలో ఆయన కెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. రామ, రావణ వైరంలో కూడా ఆయనకు వర్గ సంఘర్షణ కనిపించింది. ఇతిహాస, పురాణాల పట్ల ఆయనకు బలమైన విశ్వాసం వుంది. ఆ రచనలను మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతాన్నీ, మార్క్సిస్టు వాస్తవికతను నిగ్గు తేల్చేందుకు ఉపయుక్తం చేసుకోవటమే వింత. వేదాలు యురేషియా నుండి ఇక్కడికి వచ్చినవి. హరప్పా నాగరికత నాటి మానవులకు వేదాలకు ఎలాంటి సంబంధం లేదు. వైదిక ధర్మం పూర్తిగా విదేశీయమైంది.

యురేషియా సంచార జాతుల దురాక్రమణ వల్ల హరప్పా నాగరికత అంతరించింది. హరప్పా నాగరికతలో వర్గ అసమానతలు లేవు. వారు ఉత్పత్తి సాధనాలను అభివృద్ధి చేయటమే కాదు, శాస్త్రీయమైన జ్ఞానాన్ని కూడా నిర్మించారు. మరి హరప్పా నాగరికత కాలం నాటి పురాణాలేవి? ఇప్పుడు ప్రచలితంగా ప్రచారంలో వున్న పురాణాలకు ఎంత వయస్సు ఉంటుంది? ఇతిహాసాలు ఏ కాలంలో ఆవిర్భవించాయి? ఈ ప్రశ్నలకు మార్క్సి స్టు పద్ధతి సరైన సమాధానం చెప్పదు. ఉత్పత్తి పెరిగినప్పుడే వర్ణ వ్యవస్థ ఏర్పడిందనేది మార్క్సిస్టు అవగాహన. కానీ ఉత్పత్తి ఎక్కువగా జరిగిన హరప్పా నాగరికతలో వర్ణ వ్యవస్థ రూపొందలేదు. అంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ యురేషియా సంచార తెగల దురాక్రమణ ఫలితమని బోధపడుతుంది. అష్టాదశ పురాణాలు ప్రతివిప్లవం తర్వాత రూపొందినవి. కుల పురాణాలు కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏర్పడినవి. క్రీ.పూ. 187లో మౌర్య చక్రవర్తి బృహద్రదున్ని హతమార్చిన పుశ్యమిత్రుడు వర్ణ వ్యవస్థను పునరుద్ధరించాడు. మనుధర్మం, భగవద్గీత, మహాభారత, రామాయణాలు, అష్టాదశ పురాణాలు రాయించాడు. అంటే వర్ణ వ్యవస్థను సమర్ధించే రచనలు మూలవాసీ చక్రవర్తి బృహద్రదుని రాజ్యాన్ని బ్రాహ్మణుడైన పుశ్యమిత్రుడు చేజిక్కించుకొన్నాకే జరిగింది.

కానీ, వర్గ సిద్ధాంతం ప్రకారం పైన పేర్కొన్న రచనలన్నీ సమాజం తనకు తానే ఉత్పత్తి క్రమంలో కల్పించుకొన్నవి. అందుకే వాటిలో మార్క్సిస్టులు అనుకూల అంశాలను మాత్రమే చూడగలిగారు. కుల వ్యవస్థ పరిణామాన్ని సూత్రీకరించడానికి చారిత్రక భౌతికవాదం సరిపోదు. అది వర్గ ప్రాతిపదికన మాత్రమే సమాజాన్ని వ్యాఖ్యానించగలదు. సుమారు వేయి సంవత్సరాల పాటు ఉనికిలో వున్న బౌద్ధ రాజ్యాలలో ఎలాంటి సాహిత్యం ఉందో తెలుసుకొనే ప్రయత్నం మార్క్సిస్టు సాహిత్యకారులు చేయలేదు. వేద కాలంలోని రచనలను విశ్లేషించి, ఆ వెంటనే ప్రబంధ కాలానికి వెళ్లిపోయే ఒక పలాయన వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. బౌద్ధ రాజ్యాల్లో విలసిల్లిన సాహిత్య, సాంస్కృతిక, కళా సిద్ధాంతాలను గానీ, విద్యా, వైజ్ఞానిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని గానీ ఏ మాత్రం ప్రస్తావించరు. అంటే, బ్రాహ్మణవాద చరిత్రకారులు ఏ ఆకరాలను ప్రామాణికమని సమాజం మీద రుద్దారో వాటిని మాత్రమే గ్రహిస్తే సమాజ పరిణామ క్రమం సవ్యంగా ఎలా అర్థం అవుతుంది? చారిత్రక భౌతికవాదం పేరుతో బ్రాహ్మణీయ చరిత్ర రాజ్యమేలింది. ఇయంఎస్ నంబూద్రిపాద్ రాసిన 'వేద భూమి' అందుకు నిదర్శనం. వాస్తవికవాదం బ్రాహ్మణవాదానికి మరో పేరుగా మారిపోవటమే విచారం. యూరోప్ సమాజంలో అది సాధించిన ఘన విషయాలు ఇక్కడ సాధించలేకపోవడానికి అది వక్రీకరణకు గురికావటమే కారణం.

వాస్తవికవాదం పేరుతో చలామణి అయిన సాహిత్య ఆధిపత్యానికి ప్రతిస్పందనగా వచ్చిందే 'ప్రతివాస్తవికవాదం' (కౌంటర్ రియలిజం). కులం ఒక వాస్తవం. అస్పృశ్య రచయితలు సాహిత్యంలో కుల వ్యవస్థ స్వరూప, స్వభావాలను చిత్రించిన తీరు, కులం ఒక అధికార వ్యవస్థగా ప్రజల జీవితాలను శాసించే సామాజిక నియతిని కళాత్మకంగా రూపుగట్టిన తీరును పఠించే ఒక పద్ధతే ప్రతివాస్తవికవాదం. అదొక పఠన పద్ధతి మాత్రమే కాదు. ప్రాపంచిక దృక్పథం కూడా. ప్రతివాస్తవికతను అర్థం చేసుకొనేందుకు అంబేద్కరిజం వెలుగులో కుల వాస్తవికతను అర్థం చేసుకోవాల్సిందే. బ్రాహ్మణ ధర్మంలోని కుల అంతర్వుల నియమాన్నీ, కులం పేరుతో కొనసాగుతున్న దాస్యాన్ని చిత్రించటమే సాహిత్యంలో ప్రతివాస్తవికత. కుల వ్యవస్థలో బానిస కులాల రచయితలు సమాజ పరివర్తన కోసం సృజించిన రచనలన్నీ ప్రతివాస్తవికత పరిధిలోకి వస్తాయి. కులం పేరుదో చీల్చబడిన మూలవాసుల కళా సృజనకు, బ్రాహ్మణవాదుల కళా దృష్టికీ మధ్య చాలా వైరుధ్యం తప్పకుండా వుంటుంది. అందుకే ప్రతివాస్తవికవాదం కళాతత్వానికి సంబంధించింది కూడా. పరావర్తన సిద్ధాంతంతో పీడిత కులాల నిజమైన జ్ఞాన సిద్ధాంతానికి సంధి కుదరదు. మసక బారిన పరావర్తన అద్దం సత్య రూపాన్ని ప్రతిఫలించదు. బ్రాహ్మణీయ జ్ఞాన సిద్ధాంత పద్ధతిలో చరిత్ర సమాలోచన చేస్తే సత్యం బోధ పడదు. మూడు దశాబ్దాల కింద అలవాటైన వాస్తవికతను పట్టుకొని వేళ్లాడే మూసవాదులకు ఈ కొత్త జ్ఞాన సిద్ధాంతం చికాకునూ చిరాకునూ కల్గిస్తుంది. అయినా సరే, సత్యాన్ని సత్యంగా చెప్పమని కదా అంబేద్కర్ బోధించింది!

- డా.జిలుకర శ్రీనివాస్
jilukara@gmail.com

Sunday, 31 March 2013

తొలి ''ప్రాతినిధ్య ''ఆవిష్కరణ


మీనాక్షి నా మొదటి కుమార్తె .సామాన్యకిరణ్ ఫౌన్డేషణ్ నా రెండవ కుమార్తె . ప్రాతినిధ్య నా మూడో అమ్మాయి . 
అస్తిత్వ ప్రశ్నలకూ ,ఆవేదనలకూ వేదిక కాదలచి ఒకానొక రాజకీయ ఆవశ్యకతతో ఆవిర్భవించింది ''ప్రాతినిధ్య ''. ఆవిష్కరణకు  నేను ఎంచుకున్న రోజు సావిత్రీ బాయి వర్ధంతి అయిన మార్చ్ 10.  అనివార్య కారణాలతో ఆ రోజు నుండి వాయిదా పడుతూ మార్చ్ 28 న ఆవిష్కరించాల్సి వచ్చింది . 

ప్రాతినిధ్య ఆవిష్కరణ ఘనంగా జరిగింది . కళ్యాణ రావు గారు ,పాణి గారు, జిలుకర శ్రీనివాస్ ,వక్తలుగా వచ్చారు మరో వక్త ఖాదర్ మొహియుద్దీన్ గారు అనారోగ్య కారణాల వల్ల రాలేక పోయారు . 

ఇంత పెద్ద పని కదా చేయగలనా లేదా అని చాలా భయం వేసింది .చేసేసాం .తొలి ప్రతిని సెంటిమెంటల్ గా వాసిరెడ్డి నవీన్ గారికి అంద  జేసాం .కథ లాగే ''ప్రాతినిధ్య ''కూడా నా జీవిత పర్యంతం సాగాలని. నడపగలనని నా పై నాకు నమ్మకముంది . 

సభకు పెద్దలు ,ప్రముఖులు ,పిల్లలూ వొంద  మంది దాకా వచ్చారు . వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు . 

కళ్యాణ రావు గారు కథల గురించి చెప్పారు. 

పాణి గారి మధ్య, జిలుకర శ్రీనివాస్ ఉపన్యాసాల మధ్య సైద్దాంతిక  ఘర్షణ మరోసారి బట్టబయలయింది . 

మిస్ g s k.మీనాక్షి సావిత్రీ బాయి ఫూలే గురించీ ,సామాన్యకిరణ్  ఫౌండేషన్ గురించీ మాట్లాడింది 

తొలి ప్రాతినిధ్య 


సంపాదకులు సామాన్య,కుప్పిలి పద్మ 






చిరునవ్వుల మధ్య ''ప్రాతినిధ్య ''సాయంత్రం 


                                        ''ప్రాతినిధ్య ''ఆవిష్కరణ 


తొలి ప్రాతినిధ్యను  అందుకున్న వాసిరెడ్డి నవీన్ గారు 




శ్రోతలలో కత్తి మహేష్,జుగాష్ విలి,స్నేహ తదితరులు 


అస్తిత్వాల పై పాణి గారు 


ఈ ఆధునిక కాలం లో ''కినిగే'' అవసరం గురించి అనిల్ అట్లూరి గారు 


అంబేద్కర్ చెప్పిన ప్రాతినిధ్యం గురించి జిలుకర శ్రీనివాస్ గారు 


తన అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథ వెనుక కథ గురించి రచయిత పసునూరి రవీందర్ 

పర్స్పెక్టివ్ r k  గారి నుండి ''ప్రాతినిధ్య ''కాపీ అందుకుంటూ పెద్దింటి అశోక్ కుమార్ గారు . 

''గోళ్లు ''కథ వెనుక కథ గురించి చెబుతూ వేంపల్లి షరీఫ్ గారు 


నా వోట్ అఫ్ థాంక్స్ 













ఆ మూలగా కూర్చుని వుంది మా సామాన్యకిరణ్ ఫౌండేషన్ ట్రెషరర్ ఇడిగినేని గురప్ప నాయుడు గారు ,సెక్రటరీ  
గండవరపు మధుసూదనమ్మ. 

                            






Friday, 1 March 2013

రాళ్ళు కరిగే వేళ




ఇది అకాడెమీ పురస్కారాన్ని పొందిన కన్నడ కథల సంకలనం [మొదట ముద్రణ  2010]. ఇవాళ పొద్దున్న మొదలు పెట్టాను అడపాదడపా విరామాలతో ఇప్పుడే పూర్తి చెశాను. నా రోజుని ఇందులో పోగొట్టుకున్నందుకు మనసు చాలా సంతృప్తి పొందింది . శైలిలో ఎంత భిన్నత్వమూ ,ఆకర్షణా వుందంటే ,,ఇలా రాస్తే,రాయగలిగితే ఎంత బాగుండూ అని చెడ్డ కోరిక ఒకటి నాకు బలంగా కలిగింది . చెడ్డ అని ఎందుకన్నానంటే ఈ ఆకర్షణ అనేక రోజులు నాకు మరుపుకు రాదు కాబట్టి .ప్రతి కథా ఎంత చదివిన్చిందో .   ఇంటికొచ్చిన మనుషులు,ఇంట్లో వాళ్ళతో  మాట్లాడటానికి  పుస్తకానికి విరామం ఇవ్వాల్సి వచ్చినపుడు  ఎదుట కూర్చున్నవాళ్ళపై చాలా కోపం తెచ్చుకున్నాను  మనసులో ఇవాళ .


ఈ రచయిత పేరు చెప్పలేదు కదా శ్రీ .పి.లంకెశ్ గారు . శ్రీ .అని నాకు మనస్పూర్తిగా ఆయన మేధస్సు నచ్చడం చేత అంటున్నాను.

టాల్స్టాయ్ గురించి ఈ రచయిత అన్న మాటలు బహుశా జీవితమంతా గుర్తుంచు కుంటానేమో, అదేమిటంటే ''రాయటం ఎంత కష్టమో లేదా రాయటం తప్పనిసరైనపుడు అదెంత సులభమో అంతే సుఖదాయకం కూడా ''...లంకేష్ గారు కూడా ఈ కోవలోని రచయితే అని అతని కథలు మనకు చెబుతాయి . 

Friday, 22 February 2013

శ్రీ వెంకట సుబ్బు స్మారక అవార్డ్


ప్రముఖ అనువాదకురాలు శ్రీ అల్లాడి ఉమ గారు తమ అమ్మమ్మ శ్రీ ''వెంకట సుబ్బు ''గారి పేరిట గత ఐదారేళ్ళగా ప్రతి ఏడాది ఇద్దరు రచయితలకి  అవార్డ్ ఇస్తూ వున్నారు  .,శ్రీ అబ్బూరి ఛాయా దేవి గారు ,శ్రీ వోల్గా గారు, హెచ్ సి యు ప్రొఫెసర్ సునీతా రాణి గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు . అవార్డ్ పేరిట ఒక్కోరికీ పదిహేను వేల  రూపాయల చొప్పున నగదు ఇవ్వడం జరుగుతుంది . ఈ ఏడాది కార్యక్రమం ఈ నెల 17 న హైదరాబాద్ లోని వారి ఇంట్లో జరిగింది  .''కొత్త గూడెం పోరాగాడికో లవ్ లెటర్ ''కథల పుస్తకానికి గాను నాకు ,జాజుల గౌరీ గారి కథల పుస్తకానికీ  ఇవ్వడం జరిగింది .ఇంతకు ముందు ఈ అవార్డ్ ను కె రామ లక్ష్మి  ,వినోదిని ,షెహనాజ్ ఫాతిమా వంటి వారు వివిధ ప్రక్రియలకు గాను అందుకున్నారు.వెంకట సుబ్బు గారు తమంతట తామే చదువు నేర్చుకున్నారనీ .పుస్థకాలు విపరీతంగా చదివే వారనీ .తమందరికీ వారే స్ఫూర్తి అనీ ,అందుకే వారి పేరిట ఈ అవార్డ్ ఇవ్వా లనుకున్నామని ఉమ గారు ఈ సందర్భం లో అన్నారు.

అయితే ..అక్కడికొచ్చిన ఎవరి పాపో తెలీదు కానీ , ఆ ఇంట్లో ఒక అమ్మాయి  ఉండింది ... వైష్ణవి .ఐదో క్లాసు . గచ్చక్కాయ రంగు కళ్ళు ,చిన్ని మూతి .యెర్రని పెదాలు . పావడా జాకెట్టు వేసుకుని . అన్నం తింటుంటే నా దగ్గరకొచ్చి నాక్కూడా మీలాగా కావాలని వుందాంటీ అన్నది . [నిజానికి నాకు నవ్వొచ్చిందనుకొండీ . ఎందుకంటె నాక్కూడా కొన్ని కోరికలుంటాయి అచ్చు ఆ పిల్లలానే ... ఇప్పటికీ ఇంత వృద్దాప్యం వచ్చేసాక కూడా . ]తన ఆరంగేట్రం ఫొటో స్ చూపించింది .తన మెయిల్ అడ్రస్ ఇచ్చింది .ఇంగ్లీశ్ లో రాసిన తన పోయెమ్స్ పంపుతానని చెప్పింది .ఫోన్ నంబర్ లు ఇచ్చి పుచ్చుకున్నాం .అందరూ భోజనాలు చేస్తున్నపుడు ఏకాంతంగా అట్లా మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం ..కానీ నేను చేసిన తప్పేంటంటే ఆ పిల్లని ఒక్క ఫోటో అయినా తీసుకోక పోవడం . ఆలోచిస్తుంటే ఆశ్చర్యమేసింది పెద్దయితే ఆ పాప ఎంత సౌందర్య వంతురాలు అవుతుందో కదా నని .కాకపొతే నిండు గోదారి అవుతుంది.  తోణుకూ బెణుకూ లేని చల్లని తల్లి లా . వైష్ణవీ నిజంగా నీతో టచ్ లో ఉండాలనిపిస్తుంది .ఇంట్రస్టింగ్ గా వుంది .నువ్వెలా పెరుగుతావో చూడాలని వుంది . 

Thursday, 7 February 2013

ది టర్టిల్






 Chuang Tzu - The Turtle


Chuang Tzu with his bamboo pole
was fishing in the Pu river

The prince of Chu sent two vice-chancellors
with a formal document:
We hereby appoint you prime minister

Chuang Tzu held his bamboo pole still. 
Watching the Pu river, he said:
“I am told there is a sacred tortoise offered
and canonized three thousand years ago,
venerated by the prince, wrapped in silk,
in a precious shrine on an altar
in the temple.
What do you think?
Is it better to give up one’s life
and leave a sacred shell
as an object of cult
in a cloud of incense
for three thousand years,
or to live as a plain turtle
dragging its tail in the mud?”

“For the turtle”, said the vice-chancellor,
“better to live and drag its tail in the mud!”

“Go home!”, said Chuang Tzu.
“Leave me here
to drag my tail in the mud.”

Tuesday, 5 February 2013

నా పుస్తకం ఆవిష్కరణ !



మా ఊర్లో ,మా ఇంట్లో సరదాగా మేం చేసుకున్న నా ''కొత్తగూడెం పోరాగాడికో లవ్ లెటర్ ''పుస్తకావిష్కరణ .

Wednesday, 12 December 2012

‘ఐయామ్‌ మలాలా’

‘ఐయామ్‌ మలాలా’పసుపులేటి గీత[ భూమిక నుండి ]
‘రేపు మగపిల్లల బళ్ళన్నీ తెరవబోతున్నారు. కానీ తాలిబన్లు ఆడపిల్లల చదువును మాత్రం నిషేధించారు. బీరువాలో నా యూనిఫారమ్‌, పుస్తకాల సంచీ, జామెట్రీ బాక్స్‌ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది…’
- మలాలా యూసఫ్‌ జే
ఐక్యరాజ్య సమితి 10, నవంబర్‌, 2012ని ‘మలాలా డే’గా నిర్ణయించింది. ఏ వివకక్షూ తావు లేకుండా ప్రపంచంలోని పిల్లలందరికీ చదువుకునే అవకాశాన్ని కల్పించాలన్న సదాశయానికి ఈ రోజును ఒక సుముహూర్తంగా నిర్ణయించారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ‘విద్యా’ రాయబారి అయిన గోర్డన్‌ బ్రౌన్‌ ‘ఐయామ్‌ మలాలా’ అనే పేరిట ఒక పిటిషన్‌ను ప్రారంభించారు. పాకిస్తాన్‌లోని పిల్లలందరికీ విద్యావకాశాల్ని కల్పించాలన్నదే ఈ పిటిషన్‌ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలమంది సంతకాలు చేసిన ఈ పిటిషన్‌ను గోర్డన్‌, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీకి అందజేస్తారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ 10, నవంబర్‌, 2012ని ‘మలాలా డే’గా ప్రకటించారు. పాకిస్తాన్‌లోని స్వాత్‌లోయ తాలిబన్‌ దురాగతాలతో ఇప్పటికప్పుడు మానవ వికాసానికి, మానవత్వపు ఔన్నత్యానికి దూరమై, అంధకారంలో మగ్గుతున్న ఒక చీకటి లోయ. ఆ చీకటిలో కన్ను తెరిచిన వెలుతురు కిరణమే మలాలా యూసఫ్‌ జే. ఈ ఏడాది అక్టోబర్‌ 9 న తాలిబన్‌ క్రౌర్యానికి ఎదురొడ్డి, మృత్యువును జయించిన పదమూడేళ్ళ చదువుల తల్లి మలాలా. తాలిబన్లు జరిపిన హత్యాయత్నంలో మలాలా తలగుండా తూటా దూసుకెళ్లింది. ఇప్పుడామె ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న క్వీన్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. స్వాత్‌లోయలో మౌలానా ఫజుల్లా నాయకత్వంలో తాలిబన్‌ మూకలు నిత్యం విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఆడపిల్లల చదువు, స్త్రీలు వీధుల్లో ఒంటరిగా సంచరించడం, టెలివిజన్‌, నృత్యగానాదులన్నింటి మీదా నిషేధం విధించాయి ఈ మూకలు. ప్రతిరోజూ వీధుల్లో పాకిస్తాన్‌ పోలీసుల తలల్ని తెగనరికి ప్రజల్ని భయోత్పాతానికి గురిచేస్తున్నాయి. ఆడపిల్లలకు చదువు చెప్పే అనేక పాఠశాలల్ని ధ్వంసం చేసేశారు. వందలాది బడులు ఈ భయంతో వాటంతటవే మూతబడ్డాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు స్వాత్‌ నుంచి ప్రాణాలరచేత పట్టుకుని పారిపోయారు.
మలాలా తండ్రి ఒక విద్యా ఉద్యమకారుడు. సొంతంగా ఆయన ఒక పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలకు చదువెంత ముఖ్యమో తెలిసిన వ్యక్తి. అందుకే మలాలాను కూడా ఒక ఉద్యమానికి సాధనంగా మార్చాడు. ఇంటర్‌నెట్‌పై నిషేధం ఉన్న తమ ప్రాంతంలో తాలిబన్‌ దాష్టీకాల గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు మలాలా తొలిసారిగా ఒక ఉర్దూ బ్లాగ్‌ను ప్రారంభించింది. దీనికి బిబిసి పూర్తి సహకారాన్ని అందించింది. మలాలా బ్లాగ్‌ 3, జనవరి, 2009న ప్రారంభమైంది. స్వాత్‌లో బాలికల విద్య కోసం ఒక ఉద్యమం కన్ను తెరిచింది. మలాలా ఆ ఉద్యమానికి మార్గదర్శి అయింది. ఆమె జీవితగాథను ప్రతిబింబిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. తాలిబన్‌ బెదిరింపుల్ని లెక్కచేయకుండా ఆమె అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వూలివ్వడం ప్రారంభించింది. స్వాత్‌ జిల్లా బాలల సమాఖ్యకు ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైంది. దక్షిణాఫ్రికా సామాజిక హక్కుల ఉద్యమకారుడు డెస్మండ్‌ టుటు అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఆమె పేరును ప్రతిపాదించారు. పాకిస్తాన్‌ తొలి జాతీయ యువ శాంతి బహుమతిని మలాలా అందుకుంది.
‘నిన్న నేను ఒక భయంకరమైన కలగన్నాను. దుస్స్వప్నాలు నాకు పరిపాటి అయ్యాయి. వాటినిండా హెలికాఫ్టర్లు, తాలిబన్ల కిరాతకాలు నిండి ఉంటాయి. అమ్మ నాకోసం అల్పాహారాన్ని తయారుచేసింది. నాకు బడికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. స్వాత్‌లో ఆడపిల్లల చదువు మీద నిషేధం విధించారు తాలిబన్లు. మా క్లాస్‌లో 27 మంది పిల్లలగ్గాను ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే మిగిలాం. ఇక్కడి పరిస్థితులకు భయపడి నా స్నేహితురాళ్ళు ముగ్గురు పెషావర్‌, రావల్పిండికి వెళ్ళిపోయారు…’ మలాలా తొలిరోజున తన బ్లాగ్‌లో రాసుకున్న విషయమిది.
‘నాకు ఆ దృశ్యం (తాలిబన్లు తనమీద దాడి చేయబోయే దృశ్యం) స్పష్టంగా కనబడుతోంది. వాళ్ళు నన్ను చంపడానికి వచ్చినా, వాళ్ళు చేస్తున్న తప్పేమిటో వాళ్ళకు తెలియజెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. విద్య అన్నది మా ప్రాథమిక హక్కు…’, తన మీద తాలిబన్లు ఏనాటికైనా దాడికి తెగబడతారని ముందే ఊహించి మలాలా అన్న మాట ఇది. ఆమె ఆ మాటను అక్షరాలా నిలుపుకున్నది కూడా. ఇవాళ స్వాత్‌లోయలో ప్రతి అమ్మాయి మరో మలాలాగా మారిపోయింది. ‘స్వాత్‌లోని ప్రతి అమ్మాయి ఒక మలాలానే. మా చదువును మేము చదువుకుంటాం. మేం గెలిచి తీరుతాం. వాళ్ళు (తాలిబన్లు) మమ్మల్ని ఓడించలేరు’, ఇది మలాలా స్నేహితురాలి మాట.
అందుకే ఇప్పుడు ప్రపంచంలోని పిల్లలందరూ సామాజిక, లింగ, ఆర్థిక వివక్షలతో నిమిత్తం లేకుండా చదువుకోసం ఉద్యమం దిశగా అడుగేస్తున్నారు. ‘మలాలా డే’ అందుకు తెరతీసింది. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రతి పసిపిల్లా ‘ఐయామ్‌ మలాలా’ అంటోంది.

Friday, 23 November 2012

వెన్నెట్లో తడిసిన పాట

ఈ రోజు ఒక కథ చదివాను . సైద్దాంతిక పదజాలం,పదాలను గుప్పించడం,ఆడంబరత,అనవసర మేధో ప్రదర్శన లేకుండా కథ గురించి చెప్పమంటారా ...ఆ కథ చదవగానే నేనేం చేసానంటే వెంటనే  ''మీరజాల గలడా నా యానతి ''పాట  విన్నాను .కథ అందుకు ప్రేరేపించింది .అంతకన్నా ఒక కథ అందించగల   ఉత్తమ ఫలితం ఏం వుంటుందీ  ? ఆ కథ పేరు'' వెన్నెట్లో తడిసిన  పాట ''.రచయిత  డాక్టర్ .గోపరాజు నారాయణ రావు . .http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=37222&Categoryid=10&subcatid=33

కథ చదవండి ...పాటా వినండి .

ఏమైనా ఈ అందమైన అమ్మాయి ఒకానొక మగవాడి పట్ల ''మీరజాలగలడా  నా ఆనతి ''అంటూ అంత ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించేయడం ,అందు వెనుకనున్న అమాయకత్వం నాకు ముచ్చట గొలిపాయి.

ఎంత బాగుందో జమున !!!ఎంత ముచ్చటగా అభినయించిందో !!!!!!!

Monday, 5 November 2012

''పుష్పవర్ణ మాసం''



ఒక ఏడాది నా కథా ప్రయాణాన్ని పుస్తక రూపం లోకి తెచ్చాను .కల్పన బాధను యెట్లా చెప్పాలో అర్థం కాలేదు.తను నవ్వుతూ నవ్వుతూ చాలా అణచివేతను  చెప్పేది .దాన్ని కవిత్వం యెట్లా చేయగలను ?అందుకని కల్పన కథ రాసాను.పాపాయి వాళ్ళ నాన్నకథ  చదివి ఇది ఇప్పుడు చాలా అవసరమైన కథ అన్నాడు.ఎందుకంటె తన ప్రమేయం ఏమీ లేకున్నా నేను కూడా చాలా మంది ఈ కాలపు అమ్మాయిల్లాగే చదువుకుని ఆ చదువుని ఇంటికి పరిమితం చేసుకున్నానని అందుకు చాలా వేదనను అనుభవించానని తనకు దగ్గరగా తెలుసు కనుక .

రాసిన కథలని రెండో సారి చదవడం నాకు చాలా అసహ్యం  .అయినా అట్లా నేను కొన్ని ఎక్కువ సార్లు చదువుకున్న కథ ''పుష్పవర్ణ మాసం''.అది నా బుద్దిని సంతోష పెడుతుంది.మొన్న ఊరికి వెళ్ళినపుడు నా తమ్ముడు మాటల సందర్భంలోMárquez One Hundred Years of Solitude (1967) గురించి చెబుతూ నువ్వా బుక్ చదవలేదని నాకు తెలుసు. చదివి వుంటే నీ నాయకుడిని అక్కడి నుండే తెచ్చావని అనుకుంటారు అందరూ అన్నాడు.నేను నా నాయకుడిని మా ఇంటి పనస చెట్టు పై నుంచి [మామిడి చెట్టు కాదు నిజానికి .మా పనస చెట్టు చాలా గుబురుగా వుండి దయ్యం వుండే ఉండొచ్చని భయం పెడుతుంది.నా నాయకుడు అక్కడి వాడు]తెచ్చాను .

కానీ అంత మంది చదివారు కదా,, ఒక్కరూ ...చివరికి ఆ కథ ఫెయిల్యూర్ అన్న ఖదీర్ బాబు కూడా  ఆ మాట చెప్పలేదే అని ఆశ్చర్యం వేసింది.ఏమైనా మన వాళ్ళు మహా గట్టి వాళ్ళు .చివరికి ఆ పోలికను నా కుటుంబం లో వ్యక్తే చెప్పడం అంటే ...నూరేళ్ళ ఒంటరి తనంలోని ఆ సీతాకోక చిలుకల అబ్బాయి ని,క్రితం జన్మలో నేనూ ,నా తమ్ముడూ పడీ పడీ  చదివి ,ప్రేమించి ,దుక్కపెట్టుకుని వుంటాం.అందుకే ఈ జన్మలోనూ అతను మమ్మల్ని  వదల లేదు కావచ్చును .ఇవాళే  డౌన్ లోడ్ చేసాను.నా తమ్ముడన్నాడూ '..చదవడం ఇప్పుడు పెటు కోకు .అది నాలుగొందల పేజీల పుస్తకం .నీకు కే కే ఆర్  సర్ రాసారు కదా ఒక్క వాక్యం  మిస్సయినా భావం తప్పుతుందని అచ్చు అట్లాటిదే ,నాలుగొందల  పేజీలనీ అక్షరం అక్షరం చదవాల్సిందే ..చదవడానికి మనసోక్కటీ సరిపోదూ ...నీకు ఆరోగ్యం బాలేదు కదా ప్రస్తుతం అని .అయినా చదవాలని తపన పుట్టిపోతుంది .

మొన్న పాపాయి కామిక్స్ కావాలంటే ఏర్పోర్ట్ లో బుక్ షాప్ కి వెళ్ళానా ఒక బుక్ బ్యాక్ కవర్ పై  ఈ నాలుగు మాటలూ కనిపించాయి.''a one line suicide note left by a total stranger ,a small-time writer avinash suvarna ,reveals to young journalist laya thomas ...అంటూ ఉండిందా ఆ వన్ లైన్ సూసైడ్ నోట్ అనే మాట కోసమని బుక్ ని పటుకోచ్చేసా .ఈ వన్ లైన్ సుఇసైడ్ నోట్ కథ గుర్తొస్తుందా  తెలుగులో...నాకు పేరు గుర్తు రావటం లేదు చప్పున .నిన్న ఆ రచయితతో మాట్లాడాను కానీ ఈ విషయాన్ని  చెప్పడం మరిచా.ఈ పుస్తకం పేరు ''a tale of things timeless''[మలయాళం ]రచయిత rizio yohannan raj .చదవాలి .కానీ చదవాలంటే కొంచమేదో భయంగా వుంది .ఇంకేం రాయాలి ...నిజానికి చాలా రాయాలి .అక్టోబర్ డైరీ ...కానీ  ఇప్పుడు కాదు .ఇప్పుడు చిత్ర సుందరిని చదవాలి.

Thursday, 11 October 2012

రవీంద్ర కథావళి



ఎప్పుడో అనేక ఏళ్ళ క్రితం చదివాను రవీంద్రుడి కథలు ఆంగ్లంలో .కాబూలి వాల  ఎక్కడో పాఠం గా వుండటం ,అప్పటి ఆ పాటానికి బొమ్మ మనసులో ఇప్పుడు కూడా వుంది ఈవాల్టి లాగా నూతనంగా .హెచ్ సి యు లైబ్రరీలో గోరా చదివినపుడు కన్నూ మిన్నూ తెలియని అతని అభిజాత్యం ,ఆ పైన ముగింపు ...గౌర వర్ణపు గోరా రూపం మది చిత్రించుకున్న మరో జ్ఞాపకం .

మొన్నప్పుడు డిల్లీ  నుంచి రవీంద్ర కథావళి ని తెచ్చుకున్నానా .మేఘ సంద్రాన్ని దాటుకుంటూ ఊరికే ఒక్క కథ అనుకున్నానా ...అరె బోల్డు పనులున్నాయన్నా  రవీంద్రుడు వదలందే!

బెంగాల్ కి వచ్చాక రవీంద్రుని పట్ల బెంగాలుల పిచ్చి భక్తి ,శరతుని అసలకసలె పట్టించుకోకపోవడం చాలా బాధించేది .శరతు  పేదవాడనే కదా ,రవీంద్రుడు జమీన్దార్ అనే కదా ఆ వివక్ష అని కినుకుగా వుండేది .ఆ కినుకు శరత్ చంద్రుని   జీవిత చరిత్ర చదివాక   రవీంద్రుని పై   మరీ పెరిగింది .ఏవిటో ఒకలాటి ధిక్కారమూ ,అయిష్టమూ ...

ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు  ఈ కథలు చదివాక మనసు ఒక్క సారి  సరళమై పోయింది  .అసలకి ఇతనేంటి? స్త్రీలనీ పురుషులనీ , పిల్లలనీ ,వృద్దులనీ ,పేదలనీ, ధనికులనీ బేధ భావం లేకుండా యెట్లా అన్ని హృదయాలలోకి రాచ బాట వేసుకుని పయనించ గలుగుతున్నాడు ?ఎక్కడిది  ఇతనికీశక్తీ  అని...ఒకటే ఆశ్చర్యం .బహుసా అందుకనే  వీళ్ళందరూ గొప్ప రచయితలయ్యారేమో  .గొప్ప రచయితలంటే సర్వాంతర్యామి అయిన భగవంతుడని ఏమో !లేకుంటే ఇదంతా యెట్లా సాధ్యం ?

 ''మాష్టారు గారు '' కథలో హరలాల్ ,''రాస మణి  కొడుకు'' కథలో కాళీ పద్  పొద్దుటి నుండీ ఎంత బాధ పెడుతున్నారో.మరో మార్గమేమీ లేకుండా వాళ్ళిద్దరూ పేదరికానికి బలికావడం ఎంత బాధిస్తుందో .ప్చ్ పెద్దవాల్లమయ్యాక భోరుమని ఏడ్చే స్వాతంత్ర్యాన్ని మనమే పోగొట్టుకుని దిగులునంత గుండెకి చేర్చేసుకుంటాం .అప్పుడు కదా గుండె భరువెక్కడమనే   మాటకి  యదాతదంగా  అర్థం బోధ పడేది.

''పోస్ట్ మాస్టర్'' కథలో రతన్ ,''సమాప్తి ''లో తనకు తెలియకనే బాల్యం నుండి యవ్వనం లోకి సాగిన  చిన్ని మ్రున్మయి ,ఎప్పుడు ఎందుకు  అట్లా జరిగిందో తెలియక దుక్కాన్ని గుప్తంగా గుండెల్లో దాచ ప్రయత్నించి ఓడిన చారులత ...అసలు చారు లేదా ,,స్త్రీ బాధ అంత విశదంగా ,చూసినట్లు మరీ రవీంద్రునికి యెట్లా తెలిసిందని ఆశ్చర్యం .

''భార్య రాసిన లేఖ''లో రవీంద్రుడు భార్యగా ఒక స్త్రీ ఐ  ,చీరకి నిప్పంటించుకుని  చనిపోయిన తన అనాధ బాంధవి  గురించి ''ఊళ్ళో వాళ్ళందరూ రేగారు.'ఆడవాళ్ళు చీరెలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్ అయిపొయింది 'అన్నారు .
ఇదంతా నాటకం అన్నారు మీరు .కావచ్చు .కానీ ఈ నాటక క్రీడ -కేవలం బెంగాలీ స్త్రీల చీరెల మీదుగానే జరుగుతున్దెం ?బెంగాలీ వీర పురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకనీ  ?అది కూడా ఆలోచించి చూడటం యుక్తం ...!అని 1913 లోనే  స్త్రీల తరపున  నిర్ద్వందపు వకాల్తా పుచ్చుకున్నాడు కదా  అందుకని ఇప్పుడిహ  మూర్ఖ భక్తునికి భగవంతుని యందు ఎంత భక్తి వుంటుందో రవీంద్రునికి  అంతటి భక్తురాలనై పోయాను. అచ్చు బెంగాలుల లాగా !

ఎంతెంతో రాయాలని వుంది కానీ ఏమిటో కథా చర్చ కంటే యుక్తా యుక్త జ్ఞానాన్ని కోల్పోయి మరీ ... కన్నీటితో రవీంద్రుని పాదాలని అభిషేకించాలి వంటి డైలాగ్ లు  నిస్సిగ్గుగా ,అదుపు తప్పి వస్తున్నాయ్ . అందుకని ఇక్కడకి ముగించడం యుక్తమని ముగిస్తున్నా .

తప్పక చదవాల్సిన పుస్తకం ''రవీంద్ర కథావళి'' .ఈ గొప్ప అనువాదం మద్దిపట్ల సూరి గారిది .

Sunday, 23 September 2012

''దమయంతి కూతురు ''


http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2012%2Fsep%2F9%2Fsunday%2Fstory&more=2012%2Fsep%2F9%2Fsunday%2Fsundaymain
అనవరత ప్రయాణాలు కలిగించిన అలసట,అనారోగ్యము బ్లాగ్ పట్ల విముఖం చేసినా ఒక మంచి కథ ...తప్పని సరిగా షేర్ చెయ్యాల్సిందే అనిపించిన కథ నన్నిట్లా బ్లాగ్ దగ్గరకి తెచ్చింది.ఆ మంచి కథ పేరు ''దమయంతి కూతురు''. రచయిత్రి శ్రీ పీ.సత్యవతి గారు.

ఒక ఆదివారం ఉదయం మా ఊర్లో  వుండగా   పాపాయి వాళ్ళ నాన్న నుండి బోల్డు   వేకప్ కాల్ లు వచ్చాయి  ,,,ఇవాల్టి ఆదివారం ఆంధ్రజ్యోతి లో మంచి కథ వచ్చింది చదువు అని . ఎవరు రాసారు అనే లోపే పీ.సత్యవతి గారు అని చెప్పేసాడు .నేను బోల్డు సంతోషపడి చదవడానికి కూర్చున్నాను  .కథ అట్లా పూర్తి చేసానో లేదో మళ్ళీ ఫోన్ .లిఫ్ట్ చేయగానే మరో మాటేం లేకుండా పాపాయి ''అమ్మా ...ఊర్ద్వ లోకం అంటే  ఏంటమ్మా'' అంది.నాకిక అర్థమైపోయింది నాన పాపాయికి కథ చదివి వినిపించాడు అని .అదొక్క ప్రశ్నేనా ..ఇంకా బోల్డు ,''సౌందర్యా వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని ఏమందీ??'',అనురాధా టీచర్  చెప్పిన మెర్మన్ కథ ఏంటీ?''ఇట్లా ...!!నేను ''పోనీ సత్యవతి గారినే అడగక పోయినావా బిడ్డా ''అన్నాను. పాపాయికి  బోల్డు సిగ్గు  .అందుకని ''ఆహా ,కాదమ్మా! అమ్మా! మొత్తం కథంతా నువ్వు మళ్ళీ చెప్పమ్మా ''అన్నది .

ఇంకో వైపు పాపాయి వాళ్ళ నాన ''ఈ కథకి ఆర్ద్రతే ప్రాణం కదా ''?అని విమర్శనా పరిభాషలో ప్రశ్నించాడు.నాకు నవ్వొచ్చి సోఫాలో ఉన్న పుస్తకాల్లోనే అడుగున వల్లంపాటి''కథా శిల్పం '' పుస్తకం ఉంది తీసుకుని చదువుకో ఏం ప్రాణమో తెలుస్తుంది అన్నాను.సత్యవతి  గారి కథలంటే నాకు,మా అమ్మకీ  ఎప్పుడూ  ఇష్టమే .ఇవాళ  నాన్నా  కూతుర్ల హృదయాలను బోల్డు ఆకట్టుకున్న  ఈ కథ నా హృదయానికి మరీ  దగ్గరగా వచ్చింది. 

సత్యవతి గారి ప్రతి కథా ఉన్నత స్థాయి కథే .ప్రతి కథా సమాజం లోని ఒక సంక్లిష్టతను సరళం చేసి చెప్పడానికి వుద్దేసించిందే.అట్లాగని వారి కథలెప్పుడూ మానవ భావోద్వేగాలకి అతీతమై, ఉపన్యాసాలు ఇయ్యవు .హృదయగతంగా,అతి సరళంగానూ వుండి  ,మన మనసులకు చాలా  సన్నిహితంగా వస్తాయి .అంత మాత్రం చేత చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పగలగడం లో విఫలం చెందవు.ఇవంతా నాకు ఇంతకు మునుపే తెలిసిన విషయాలే అయినా అవాళ  నేను మళ్ళీ కొత్తగా  సత్యవతి గారి కథ ముందు పెట్టుకుని కథ యెట్లా రాయాలో నా ఎనిమిదేళ్ళ కూతుర్ని మనసులో నిలిపి  తెలుసుకున్నాను .అంత గొప్పగా రాయగలగడం యెట్లా అని దిగులు పడ్డాను .

''దమయంతి కూతురు'' కథ నా వరకు నాకు బుచ్చి బాబు గారి '' దయానిధి '' కి కొనసాగింపు .దయానిధికి తల్లి పట్ల జాలో ,సానుభూతో ,విపరీత  ప్రేమ వల్ల ఎటూ తేల్చుకోలేని తనమో ...ఏదో ఒక అవ్యక్త భావం వుంటుంది .అపరిష్కృత భావం అది .అందుకనే అతను ,తల్లి పేరు చెప్పి తనను హేళన పరుస్తున్న సమాజం నుండి విడివడి దూరమవుతుంటాడు కానీ ,,ముడిని చిక్కు తీసి ఇదీ అని అమ్మ  పట్ల అతని భావాన్ని ఇదమిద్దంగా  ప్రకటించడు .ఆ సంఘర్షణ అలవి మాలినదిగా వుండి వేదన కలిగిస్తుంది పాటకుడికి.

.ఈ కథలోని దమయంతి కూడా ఉత్తుత్తి మనిషి కాదు ''ఊర్ద్వ లోకపు మనిషి''.అందుకే భూలోకపు మనుషుల్ని వదిలేస్తుంది  .మరి ఏ లోకమూ తెలియని పసి పిల్లల గతి ఏమిటీ ??''తల్లి మచ్చ'' ను చూపించి వెంట పడి వేధించి అబ్సెషన్ కు లోను చేసి అక్కడే అదే వలయంలో పిల్లల్ని పడి కొట్టుకునేట్లు చేసే సమాజం సంగతి ఏమిటి?ఎంత పెద్ద ప్రశ్నలు  కదా ?యెట్లా అర్థం చేసుకుని ఆ తల్లిని క్షమించాలి ?అందుకు సమాధానమే ఈ కథ .దమయంతి కొడుకు "తన జీవితాన్ని మలుచుకునే హక్కు ఆవిడకుంది కదా అమ్మడూ. మనకోసం ఆమెకి అలవిమాలిన త్యాగాలు అంటగట్టకూడదు కదా. ఆమె ఎందుకు ఏ పరిస్థితుల్లో మనని వదిలి వెళ్లిందీ మనకెప్పటికీ తెలియదు, ఆమె చెబితే తప్ప. ఇంక వదిలేయ్. ఎక్కడున్నా ఆమె బాగుండాలనుకో ..'' 
"మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?''
"బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాటేమిటి?''
 అంటూ చెల్లికి ఇచ్చిన  సమాధానం ఓదార్పు కోసం ఇచ్చుకున్నది కాదు .తల్లి మచ్చ వేసి పదే పదే వేధించే సమజానికి నేర్పుతున్న పాటం అది .

మానవ సంబంధాలన్నీ వుదాత్తంగానూ ,ఉన్నతంగానూ వుండాలనేది మానవుడి సంయుక్త కాంక్ష .కానీ, ఏ వుత్పాతమూ లేకుండా ప్రకృతి సరళ రేఖలో సాగి పోవడం ఎప్పుడైనా విన్నామా ??లేదు కదా!!!మానవ భావోద్వేగ ప్రకృతి కూడా అట్లాటిదే .అందులోనూ ఎత్తుపల్లాలు వుంటాయి .ఆ ఎత్తు పల్లాలు మన చుట్టు పక్కలో ,మన జీవితాలలోనో ,మన జీవితాలకు అతి సన్నిహితంగానో ఎదురు పడినపుడు వాటిని యెట్లా స్వీకరించాలో, యెట్లా అర్థం చేసుకోవాలో నేర్పడమే కాదు ,అర్థం చేసుకోగల హృదయౌన్నత్యాన్ని కూడా ఇస్తుంది ఈ కథ .
http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2012%2Fsep%2F9%2Fsunday%2Fstory&more=2012%2Fsep%2F9%2Fsunday%2Fsundaymain

Thursday, 23 August 2012

ఆడవాళ్ళ ఏడుపు కథ!!!


ఓ హెన్రీ ఎప్పుడూ ఓ అద్బుతమే ,ఎప్పుడూ ఒక ఆశ్చర్యమే ,అనితర సాధ్యమే.

ఇవాళ ''A Harlem Tragedy'' చదువుతూ ,చదువుతూ చివరాఖరికి వచ్చి ఓ హెన్రీ అన్ని కథల్లాగే ఆశ్చర్యపడి ,తేరుకుని ,నవ్వి ,నవ్వి ...ఇక నవ్వలేక ఆశ్చర్యపడి షేర్ చేస్తున్నా .  http://www.literaturecollection.com/a/o_henry/222/

కొన్ని వాక్యాలు చాలా నచ్చాయి .ఇట్లా ..."But what does he beat you for?" inquired Mrs. Fink, with wide-open
eyes.

"Silly!" said Mrs. Cassidy, indulgently. "Why, because he's full.
It's generally on Saturday nights."

"But what cause do you give him?" persisted the seeker after
knowledge.

"Why, didn't I marry him? Jack comes in tanked up; and I'm here,
ain't I? Who else has he got a right to beat? I'd just like to catch
him once beating anybody else! Sometimes it's because supper ain't
ready; and sometimes it's because it is. Jack ain't particular about
causes. He just lushes till he remembers he's married, and then
he makes for home and does me up.
............................................
Mrs. Fink went up to her flat and had a little cry. It was a
meaningless cry, the kind of cry that only a woman knows about, a
cry from no particular cause, altogether an absurd cry; the most
transient and the most hopeless cry in the repertory of grief.

కానీ కథలో ఎంత విషాదమో .అది అంతా పక్కన పెడితే ఈ రచయిత ఆడవాళ్ళ ఈ ఏడుపు స్వభావాన్ని యెట్లా పట్టుకున్నాడా అని ఒకటే ఆశ్చర్యం!!!!!! 

Wednesday, 22 August 2012

Billy Joel - ది రివర్ ఆఫ్ డ్రీమ్స్

In the middle of the night
I go walking in my sleep
From the mountains of faith
To the river so deep
I must be lookin' for something
Something sacred i lost
But the river is wide
And it's too hard to cross
even though I know the river is wide
I walk down every evening and stand on the shore
I try to cross to the opposite side
So I can finally find what I've been looking for
In the middle of the night
I go walking in my sleep
Through the valley of fear
To a river so deep
I've been searching for something
Taken out of my soul
Something I'd never lose
Something somebody stole
I don't know why I go walking at night
But now I'm tired and I don't want to walk anymore
I hope it doesn't take the rest of my life
Until I find what it is I've been looking for
(Three beat Pause)
In the middle of the night
I go walking in my sleep
Through the jungle of doubt
To the river so deep
I know I'm searching for something
Something so undefined
That it can only be seen
By the eyes of the blind
In the middle of the night (break)

I’m not sure about a life after this
God knows I've never been a spiritual man
Baptized by the fire, I wade into the river
That is runnin' through the promised land (Long Five beat Pause)

In the middle of the night
I go walking in my sleep
Through the desert of truth
To the river so deep
We all end in the ocean
We all start in the streams
We're all carried along
By the river of dreams
In the middle of the night

Monday, 20 August 2012

ఎస్.ఆనంద్

 దుర్గాబాయ్ వ్యాం  ,సుభాష్ వ్యాం అద్భుతమైన బొమ్మలతో వచ్చిన ,నాకు చాలా నచ్చిన ''భీమాయణం ''గురించి తీరిక చేసుకుని మళ్ళీ రాస్తాను .అంత వరకూ ఎస్.ఆనంద్ http://creativeconomy.britishcouncil.org/people/s-anand/రాసిన ఈ ఆర్టికల్ .A Case For Bhim Rajya | S. Anand చదవండి.సూటిగా వుంది ,స్పష్టంగా వుంది .ముక్కు ఎక్కడ అంటే చేతిని తలవెనుక నుండి తీసుకు వచ్చే తరహాలో లేదు