About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday 12 May 2012

రెండు అభిప్రాయాలు -ఆనందము


నాకు, డాక్టర్ కేశవ రెడ్డి గారు ఒక మెసేజ్ పంపించారు.చిన్నప్పుడు మా ఇంట్లో, కేశవ రెడ్డి గారి ''స్మశానం దున్నేరు ''
పుస్తకం వుండేది.మా నాన్న కూడా ఆయన లాగే చిత్తూరు వాడు ..అట్లా రాయల సీమ భాషలోని 
ఆ పుస్తకాన్నినేను చాలా సార్లు చదివాను.తరువాతవారి 
ప్రతి పుస్తకాన్ని వచ్చింది వచ్చినట్లు చదివాను.నాకు చాలా  ఇష్టమైన రచయితల్లో వారు ఒకరు.వారి నుండి 
నిన్న మద్యాహ్నం మెసేజ్ వచ్చింది. ఇవాళ వారితో మాట్లాడాను.రాస్తూ పొమ్మన్నారు.వారి మెసేజ్ ఇది .
dear saamaanya ,the story 
mahitha is good.language
is clean ,narration is 
smooth,plot is plausable .
...dr.keshav reddy.
ఎంత బాగుంది కదా వారి మెసేజ్.నేను జీవితాలను బాగా అర్థం చేసుకుని కథను బాగా రాస్తేనే కదా వారు నాకట్లా చెప్పి వుంటారు.అంటే అర్థం నాకు జీవితం తెలుసనే కదా? 
మేధావులు ఊరికే చెప్తారా ఏమిటి మాటలు .మేధావులు చెప్తే అది  తిరుగులేని నిజం.  కదా ?
 
 నా స్నేహితురాలు కాల్ చేసింది ఈ రోజు .తన బాధ ఏంటో చెప్తుంది .నేను వింటున్నా.మద్యలో తనో కంప్లైంట్ చేసింది . నేను నా సమస్యని చెప్తుంటే నువ్వు అవతలి వాళ్ళ పక్క వకాల్తా పుచ్చుకుని వస్తావ్ 
సామాన్య ఎప్పుడూ అని.అసలు నీకు జీవితమే తెలియదు.ఇంకెప్పటికీ తెలీదు నీ చుట్టూ మీ అమ్మ, 
నాయన,తమ్ముడ్లూ,పెదమ్మలు,కిరణ్,చివరికి నీ కూతురు కూడా నిన్నే ముద్దు చేస్తుంటే నీకు 
జీవితం,ప్రపంచం ఎక్కడ తెలుస్తుందీ.మళ్ళీ ఏమో రాసేస్తావ్ కథలు,కవితలూ అని ఘోరంగా తిట్టేసింది..

మన స్నేహితులు మన గురించి అబద్దాలు ఎందుకు చెప్తారు? చెప్పరు.  అన్నీ నిజాలే చెప్తారు!

2 comments:

Anonymous said...

Sooo...sweet!

వెంకట రాజారావు . లక్కాకుల said...

రెండూ నిజమేగా ! మరి !
దండిగ మీలోని 'కవిని 'తలచిన దొకటీ
రెండోది 'మిమ్ము' దలచుక
ఫ్రెండన్నది - ఔన ? కాద ? శ్రీ సామాన్యా !

బ్లాగు సుజన-సృజన